హిందుస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌కు సీఎం కేసీఆర్

342
cm kcr
- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. సింగపూర్ లో జరిగే హిందుస్ధాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ లో పాల్గోనాలని సీఎం కేసీఆర్ కు ఆహ్వానం వచ్చింది. సెప్టెంబర్ 6న ఈసదస్సు జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్య వక్తగా హాజరుకావాలని హిందుస్థాన్‌ టైమ్స్‌ ఛైర్‌పర్సన్‌ శోభన భారతియా సీఎం కేసీఆర్‌ను కోరారు.

ఈ మేరకు శోభన భారతియా కేసీఆర్‌కు లేఖ రాశారు. సదస్సులో భారత్‌తో పాటు.. పొరుగు దేశాలు, ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించనున్నారు. ఆసియా ఇన్ ద న్యూ గ్లోబల్ కాంటెస్ట్ థీమ్‌తో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు.

- Advertisement -