Chandrababu:తిరుమలలో హిందువులకే ఉద్యోగాలు

2
- Advertisement -

తిరుమల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు ఏపీ సీఎం చంద్రబాబు. పద్మావతి అతిథి గృహంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, ఇతర అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇకపై తిరుమలలో హిందువులకు మాత్రమే ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు.టీటీడీలో అన్యమత ఉద్యోగులను తొలగించడానికి ఆదేశాలు ఇచ్చామని వెల్లడించారు.

గత ప్రభుత్వం ఏడు కొండలను ఆనుకుని ముంతాజ్ హోటల్ కు అనుమతి ఇచ్చారని, ఆ హోటల్ కు 20ఎకరాలు కేటాయించారని విమర్శించారు. దీనిపై తాము చర్యలు తీసుకున్నామని, మరో 35.32 ఎకరాల్లో వివిధ సంస్థలకు భూ కేటాయింపులను కూడా రద్దు చేశామని తెలిపారు. వెంకటేశ్వరస్వామి ఆస్తులన్నీ కాపడట‌మే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వెంకటేశ్వరస్వామి ఆలయాలు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. ఆయా రాష్ట్రాల సీఎంలు కూడా ముందుకొస్తే త్వరితగతిన ఆలయ నిర్మాణాలు చేపడతామని చెప్పారు. శ్రీవారి ఆలయాల నిర్మాణం కోసం ప్రత్యేకంగా ఆలయ ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు తెలిపారు.

అన్నదానం, ప్రాణదానం తరహాలోనే మాధవ సేవ పేరుతో కొత్త కార్యక్రమం చేపడుతున్నామని వెల్లడించారు. భక్తులకు అన్నప్రసాదాలు స్వయంగా వడ్డిస్తే కలిగే తృప్తి వెలకట్టలేనిదన్నారు.

Also Read:ఎన్నికల ముందు హామీల జాతర..ఎన్నికలయ్యాక హామీల పాతర!

- Advertisement -