సచివాలయం కూల్చివేతకు తాత్కాలిక బ్రేక్…

219
ts high court
- Advertisement -

సచివాలయం కూల్చివేతకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.ఈ నెల 15 వరకు సచివాలయం కూల్చివేతను ఆపాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. సచివాలయ భవనాల కూల్చివేతపై విచారణ జరిపింది హైకోర్టు.

భవనాల కూల్చివేత అనుమతులపై కౌంటర్ ద్వారా కోర్టు కు సమర్పించింది ప్రభుత్వం.క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం షీల్డ్ కవర్ లో సమర్పించాలని హైకోర్టు అదేశించింది. ఇవాళ సాయంత్రం సమర్పిస్తామన్న ఏజీ..

ప్రభుత్వం ధాఖలు చేసిన కౌంటర్ పై రీప్లై కౌంటర్ ధాఖలు చేస్తామన్న పిటిషనర్ తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్ధానం తదుపరి విచారణను ఈ నెల 15 కు వాయిదా వేసింది.

- Advertisement -