త్రివిక్రమ్ బ‌జ్ ఎలా క్రియేట్ చేస్తాడో?

41
- Advertisement -

ద‌ర్శ‌కుడిగానే కాకుండా త్రివిక్ర‌మ్ క‌థ‌, మాట‌లు అందించి కూడా సంపాదిస్తున్నాడు. ప‌వ‌న్ చేస్తున్న రీమేక్ సినిమాల‌న్నింటికీ త్రివిక్ర‌మే అన్నీ ద‌గ్గ‌రుండి చూసుకుంటాడ‌న్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు ప‌వ‌న్ హీరోగా వ‌స్తున్న బ్రో సినిమాకు కూడా త్రివిక్ర‌మ్ అన్నీ తానై న‌డిపిస్తున్నాడు. దీనికి గాను త్రివిక్ర‌మ్ ఏకంగా రూ.15 కోట్ల రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటున్నట్లు స‌మాచారం. ఇప్పటికే ఈ సినిమా పై పవన్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్ కూడా చాలా బాగుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

పైగా సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో పాటు సాయి తేజ్ కూడా ప్ర‌ధాన పాత్ర‌లో నటిస్తున్నాడు. ఇక ఈ బ్రో సినిమా జులై 28న రిలీజ్ కానుంది. మొత్తానికి ఈ మూవీ రిలీజ్‌కు ఇంకా 20 రోజులు కూడా లేదు. కానీ మేక‌ర్స్ మాత్రం ఇంకా భారీ స్థాయిలో ప్ర‌మోష‌న్స్‌ను మొద‌లుపెట్ట‌లేదు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల పరంగా ఫుల్ బిజీగా ఉండటంతో ఈ సినిమా ప్రమోషన్స్ ను పోస్ట్ పోన్ చేయాలని త్రివిక్రమ్ చెప్పారట. అలాగే, సినిమాలో కొన్ని సీన్స్ విషయంలోనూ త్రివిక్రమ్ హ్యాపీగా లేడని తెలుస్తోంది. అందుకే, ఆ సీన్స్ ను కుదించే పనిలో ఉన్నాడు త్రివిక్రమ్.

Also Read:రేవంత్ మాటలు శుద్ద అబద్దం:గుత్తా

మొత్తమ్మీద తాను తీసుకున్న రెమ్యూన‌రేష‌న్ కి నాయ్యం చేస్తున్నాడు. కాకపోతే.. ప‌వ‌న్- సాయి తేజ్‌ లాంటి కాంబోని పెట్టుకుని కూడా రోజురోజుకు సినిమాకు బ‌జ్ పెరుగుతూ వెళ్లకపోతే.. ఇక సినిమాకి రికార్డు స్థాయి ఓపెనింగ్స్ ఎలా వస్తాయి?, ఇది తెలియని అంత అమాయకుడు కాదు త్రివిక్రమ్. మ‌రి రిలీజ్ లోపు త్రివిక్రమ్ ప్ర‌మోష‌న్స్‌తో ఎలాంటి బ‌జ్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

Also Read:Siddaramaiah:అలా చేస్తే రాజకీయాలకు గుడ్ బై చెప్తా

- Advertisement -