ప్రతీ ఒక్కరు స్వచ్ఛందంగా మొక్కలు నాటాలి..

258
Kura Karnakar Reddy
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా హెట్రో డైరెక్టర్ కూర కర్ణాకర్ రెడ్డి గురువారం కరీంనగర్ లోని తమ కార్యాలయంలో మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా కర్ణాకర్ రెడ్డి మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు సంతోష్ ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారని అందులో భాగంగా మేము స్ఫూర్తి పొంది ఈ రోజు మా కార్యాలయంలో మొక్కలు నాటడం జరిగింది అని అన్నారు. పెరుగుతున్న వాతావరణ కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తమ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Hetero Director

- Advertisement -