మహేశ్ బాబు హ్యాండ్సమ్..పవన్ స్టైలిష్

530
Shruthihasan
- Advertisement -

ప్రముఖ హీరోయిన్ శృతిహాసన్ గత కొద్ది రోజులుగా సినిమాలకు దూరంగా ఉంది. తన బాయ్ ఫ్రెండ్ తో బ్రేక్ అప్ తర్వాత కొన్ని రోజులు ఒంటరిగా గడిపింది. ప్రస్తుతం ఆమె తిరిగి సినిమాల్లో బిజీగా ఉంది. తెలుగు, తమిళ్ భాషల్లో పలు సినిమాల్లో నటిస్తుంది. తెలుగులో అగ్ర హీరోలందరి సరసన నటించి మంచి హిట్ సాధించింది. తెలుగులో విజయాలు రావడంతో అమ్మడుకు బాలీవుడ్ లో ఆఫర్లు వచ్చాయి. దీంతో తెలుగు సినిమాలకు గ్యాప్ ఇచ్చి బాలీవుడ్ కు వెళ్లింది. అక్కడ పెద్దగా విజయాలు రాకపోవడంతో తిరిగి మళ్లీ తెలుగులో సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం రవితేజ సరసన క్రాక్ సినిమాలో నటిస్తుంది. బలుపు సినిమా దర్శకుడు గోపిచంద్ మలినేని ఈసినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

Shruthihasan Mahesh Babu

తాజాగా ఓ ఇంటర్వూలో తెలుగు హీరోలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తెలుగు ఇండస్ట్రీలో తనకు మంచి విజయాలు వచ్చాయని చెప్పింది. మహేశ్ బాబుతో శ్రీమంతుడు, అల్లు అర్జున్ తో రేసుగుర్రం, రవితేజతో బలుపు వంటి సినిమాలు భారీ విజయాన్ని సాధించాయని చెప్పారు. వీటన్నింటి కంటే గబ్బర్ సింగ్ సినిమాది ప్రత్యేక స్ధానం అన్నారు. తెలుగు హీరోల్లో మహేవ్ బాబు హ్యాండ్సమ్ అని, .. పవన్ కల్యాణ్ స్టైలీష్ పర్సన్ , బన్నీకి అంకితభావం ఎక్కువ .. ఆకర్షణీయమైన హైట్ ప్రభాస్ సొంతం అని చెప్పుకొచ్చింది. ఇక శృతిహాసన్ హీరోయిన్ గా నే కాకుండా సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

- Advertisement -