ఆ సినిమా చాలా బోర్ గా ఉందిః రష్మీక

417
Rashmika-Mandanna
- Advertisement -

ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది రష్మీక మందన. ఛలో మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి న రష్మీక గీత గోవిందం సినిమాతో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇటివలే మహేశ్ బాబుతో సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించి సక్సెస్ ను సాధించింది. నితిన్ కు జోడిగా రష్మీక నటించిన చిత్రం భీష్మ. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈచిత్రం ఇటివలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈనెల 21న గ్రాండ్ గా విడుదల కానుంది.

దీంతో ఈమూవీ ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు చిత్రయూనిట్. ప్రమోషన్స్ లో భాగంగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది రష్మీక. ఇంటర్యూలో భాగంగా వాలెంటెన్స్ ఎలా సెలబ్రెట్ చేసుకున్నారు అని అడగ్గా.. ఈ వాలెంటైన్స్ డే నాకు చాల బోర్‌గా సాగింది. ఒక రొమాంటిక్ సినిమా చూసి ఎంజాయ్ చేద్దామనుకుంటే 30 మినిట్స్‌కే ఆ సినిమా బోర్ కొట్టింది. ఆ మూవీ ఇంగ్లీష్ మూవీలేండి… మళ్ళీ ఏ తెలుగు మూవీ అని అడుగుతారని తెలిపింది. ఇక ఈమూవీ తర్వాత రష్మీక అల్లు అర్జున్ సుకుమార్ మూవీతో పాటు ఎన్టీఆర్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాలో కూడా నటిస్తుంది.

- Advertisement -