పూరీ చెబితే హైదరబాద్ వచ్చా..నాగార్జునకు థ్యాంక్స్

295
puri nagarjuna anushka
- Advertisement -

లేడి ఓరియెంటెడ్ మూవీలో నటించి టాలీవుడ్, కోలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అనుష్క. అరుంధతి, బాహుబలి, భాగమతి సినిమాలతో లేడి హీరోగా పేరొందింది. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఆమెకు క్రేజ్ వచ్చింది. అయితే ‘భాగమతి’ చిత్రం తర్వాత కాస్త విరామం తీసుకున్న స్వీటీ.. ప్రస్తుతం హేమంత్‌ మధుకర్‌ తెరకెక్కిస్తున్న ‘సైలెన్స్‌’ (వర్కింగ్‌ టైటిల్‌) చిత్రంలో నటిస్తోంది. అయితే అనుష్క ఇండస్ట్రీకి వచ్చి నేటితో 14ఏళ్లు పూర్తి చేసుకుంది.

ఈసందర్బంగా ఆమె దర్శకుడు పూరీ జగన్నాథ్ కు, హీరో నాగార్జునకు థ్యాంక్స్ చెప్పింది. 14ఏళ్లు పైర్తైన సందర్భంగా అనుష్క సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేసింది. నాకు నేనుగా సినిమాల్లోకి రాలేదు. సూపర్ మూవీలో పూరీ జగన్నాధ్ గారు హీరోయిన్ కోసం చూస్తుంటే నాకు తెలిసిన ఆయన ఫ్రెండ్ ఒకరు నా గురించి చెప్పారు. దీంతో పూరీ జగన్నాథ్ గారు నాకు ఫోన్ చేసి హైదరాబాద్ రమ్మని చెప్పారు. అలా నాకు సూపర్ సినిమాలో అవకాశం వచ్చిందంని తెలిపింది. నా జీవితాన్ని మార్చేసిన పూరీ జగన్నాథ్, కింగ్ నాగార్జునకు ధన్యవాదలు తెలిపింది. వాళ్లు నా ఫ్యామిలీ లాంటి వారిని ట్వీట్ చేసింది.

https://twitter.com/Anushka_ASF/status/1105461109908111360

- Advertisement -