చావు నుంచి తప్పించుకున్న స్టార్ హీరో

31
- Advertisement -

విశాల్ నటించిన తాజా చిత్రం ‘మార్క్ ఆంటోనీ’ సెప్టెంబర్ 15న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్‌లో పాల్గొన్న విశాల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ మూవీ షూటింగ్‌లో తాను తృటిలో చావు నుంచి తప్పించుకున్నట్లు తెలిపాడు. ఫైట్ సీన్ ముగించి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఒక పెద్ద ట్రక్కు తన వైపు దూసుకొచ్చిందని, సరైన సమయంలో దానిని గమనించడంతో తాను ప్రమాదం నుంచి తప్పించుకున్నానని ఎమోషనల్ అయ్యాడు. విశాల్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.

మరోవైపు కోలీవుడ్‌ లో విశాల్‌ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడంటూ గత కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతుంది. గత వారం నుంచి అయితే ఈ ప్రచారం మరింతగా ఊపందుకుంది. ముఖ్యంగా హీరోయిన్‌ లక్ష్మీ మీనన్‌ ను విశాల్ పెళ్లి చేసుకోబోతున్నాడని నెట్టింట వైరల్ అయింది. ఐతే దీనిపై కూడా విశాల్‌ క్లారిటీ ఇచ్చాడు. ‘సాధారణంగా పుకార్లు, అసత్య ప్రచారాలపై నేను స్పందించను. కానీ ఈ సారి లక్ష్మీ మీనన్‌తో నా పెళ్లి జరగబోతుందని ప్రచారం మొదలుపెట్టారు. దీన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నానని’ విశాల్ తెలిపాడు.

Also Read:Virat Kohli:ఆ వార్తల్లో నిజంలేదు

నిజానికి లక్ష్మీ మీనన్‌ కి గతంలోనే ఓ సీక్రెట్ మ్యారేజ్ జరిగింది. కాకపోతే.. సినిమాలో కలిసి నటించే సమయంలో విశాల్ కి – లక్ష్మీ మీనన్‌ కి మధ్య బంధం మరింత బలపడింది. ఇద్దరు ప్రేమలో ఉన్నారని పుకార్లు వినిపించాయి. విశాల్ మాత్రం ఆమెను ఆ తర్వాత దూరం పెట్టాడు. ఆ తర్వాత పలువురు హీరోయిన్ లతో కూడా విశాల్ పెళ్లి అంటూ వార్తలు వచ్చాయి. కానీ వాటిలో ఏ మాత్రం నిజం లేదు.

Also Read:విక్రమ్ సారాభాయ్..జీవిత చరిత్ర

- Advertisement -