ఒళ్లు బలిసి… గులతో సినిమా తీయలేదు !

215
Hero to villain & villain to hero again
Hero to villain & villain to hero again
- Advertisement -

హీరోనుంచి విలన్‌గా మారి, పలు భాషల్లో తన విలనిజాన్ని చూపిస్తూ.. క్రేజీ విలన్‌గా దుమ్ముదులిపేస్తున్న సీనియర్‌ హీరో జగపతిబాబు..ఇప్పుడు మళ్ళీ హీరోగా వస్తున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉన్న జగపతిబాబు ‘పటేల్‌ సర్‌’ సినిమాతో మరోసారి హీరోగా తన మార్క్‌ చూపించేందుకు రెడీ అయ్యాడు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ చిత్రంలో ఓ కిల్లర్ పాత్రలో జగ్గూ భాయ్ కనిపించబోతున్నాడు. వైట్ హెయిర్‌తో ఓ ఏజ్ డ్ పర్సన్‌గా పూర్తిగా ఫిట్ బాడీతో మెస్మరైజ్ చేసేందుకు ఈ నెల 14న వస్తున్నాడు..

ఈ సంధర్బంగా పలు టీవీ ఛానళ్లతో ఇంటర్వ్యూల్లో పాల్గోంటున్నాడు జగ్గుభాయి.. సినిమాల్లో విలన్ పాత్రలు చేయడానికి ముందు గ్యాప్‌ గురించి అడగ్గా.. తాను గ్యాప్ తీసుకోలేదని.. ఇండస్ట్రీనే గ్యాప్ ఇచ్చిందని.. అందుకే అవకాశాలు లేక ఖాళీగా ఉన్నానంటూ మొహమాటం లేకుండా చెప్పేశాడు.. జగపతి మాట తీరే అంత.. ఆయన సూటిగా సుత్తి లేకుండా మాట్లాడుతుంటాడు..

patel

ఇక విలన్‌గా, తండ్రిగా, బాబాయ్‌గా ఇలా పాత్ర ఏదైనా తన మార్క్‌ నటనతో కెరీర్ అద్భుతంగా సాగిపోతున్న టైంలో జగపతిబాబు మళ్లీ హీరోగా మారి ‘పటేల్ సార్’ అనే సినిమా చేయడంపైనా కొందరు సెటైర్లు వేశారు.దీనిపైన స్పందించిన జగపతి.. తనకు హీరో అనిపించుకోవాలనేమీ లేదని.. ఈ వయసులో తనకు హీరోగా చేయాల్సిన అవసరం కూడా లేదని.. కాకపోతే అప్పుడప్పుడూ ఇలాంటి ప్రయత్నాలు చేయకపోతే తనకు తానే బోర్ కొట్టేస్తానని అన్నాడు.

తన భార్య కూడా విలన్‌ వేశాలు వేసుకుంటున్నారు కదా.. మళ్లీ హీరోగా నటించడమేంటని అడిగిందని చెప్పిన జగపతి.. ఈ కథలో ఉన్న ప్రత్యేకత వల్లే కథానాయకుడిగా నటించాల్సి వచ్చిందని చెప్పాడు. అంతేకాదు తనదైన శైలిలో “నిర్మాత సాయికి ఒళ్లు బలిసి ఈ సినిమాను నిర్మించలేదు. నేనేదో గులతో ఇందులో హీరోగా నటించలేదు. జనాలు అలా ఎంతమాత్రం అనుకోని విధంగా ‘పటేల్ సార్’ ఉంటుంది” అంటూ జగపతి చెప్పుకోచ్చాడు.. వారాహి చలచిత్ర బ్యానర్ పై వాసు పరిమి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి వుంది.

- Advertisement -