తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో శ్రీకాంత్..

89
srikanth
- Advertisement -

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.. ఇవాళ ఇదయం వి.ఐ.పి విరామ సమయంలో ఎంపి మోపిదేవి వెంకటరమణ, అన్నపూర్ణ ట్రస్టు వ్యవస్థాపకులు భగవన్ శ్రీ సత్య సాయి సద్గురు శ్రీ మధుసూదన్ సాయి, సినీ నటుడు శ్రీకాంత్ లు కుటుంబ సమేతంగా వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.

అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.. అనంతరం ఆలయ వెలుపల ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ మధుసూదన్ సాయి మీడియాతో మాట్లాడుతూ.. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో, అన్నపూర్ణ ట్రస్టు ఆధ్వర్యంలో తిరుపతిలోని ప్రభుత్వ పాఠశాల్లో ఉదయం అల్పారం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.. దాదాపు యాభై ఒక మందికి‌ పిల్లలకు ప్రతి రోజు అల్పాహారం అందించనున్నట్లు ఆయన తెలిపారు.

- Advertisement -