పూరీతో రామ్‌ ‘రెడ్’ ప్రారంభం..!

568
ram red
- Advertisement -

టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా తర్వాత హీరో రామ్ మరో సినిమాకు ఓకే చెప్పాడు. ప్రస్తుతం ఈ హీరో కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘రెడ్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. కాగా తమిళ్‌లో విజయం సాధించిన ‘తాండవం’ రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం ఇవాళ హైదరాబాద్‌లో జరిగింది.

red movie

ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి పూరీ జగన్నాథ్ క్లాప్ కొట్టాడు. ఈ ప్రాజెక్ట్‌ను రామ్ పెదనాన్న స్రవంతి రవికిశోర్ నిర్మిస్తున్నారు. అలాగే సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ మూవీకి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నాడు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ మూవీలో రామ్‌ సరసన హీరోయిన్ ఎవరన్నది తెలియాల్సివుంది.

- Advertisement -