ఆసినిమాకు పోస్టర్ల డబ్బులు కూడా రాలేః అడవి శేష్

463
adivi-sesh
- Advertisement -

వైవిధ్యభరితమైన సినిమాలు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యువ హీరో అడవి శేష్. సినిమాల పట్ల అతని ఉన్న ఆసక్తితో అమెరికాలో ఉద్యోగం వదిలేసి వచ్చాడు. కెరీర్ ప్రారంభంలో సైడ్ క్యారెక్టర్లు చేసినా ప్రస్తుతం హీరోగా రచయితగా సెటిల్ అయ్యాడు. అడవి శేష్ హీరోగా నటించిన ఎవరు ఈనెల 15న విడుదలైన ఈచిత్రం పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తుంది.

Evaru

ఈసందర్భంగా నిన్న హైదరాబాద్ లో సీనిమా సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈసందర్భంగా అడవి శేష్ మాట్లాడుతూ.. నేను డైరెక్టర్ గా కిస్ అనే సినిమా చేశారు. ఆ మూవీ పెద్ద ప్లాప్ అయ్యింది. ఆ సినిమాతో నేను చాలా నష్టపోయాను. అప్పటి వరకు నేను సంపాదించుకుంది అంతా ఆ సినిమాతో పోయింది.

ఆ సినిమా పోస్టర్స్ అంటించడానికి ఖర్చు చేసిన మైదాపిండి డబ్బులు కూడా రాలేదు. ఆ సినిమా తర్వాత దర్శకత్వం వదిలేసి నటనపై దృష్టి పెట్టాను. ఫ్లాప్ దర్శకుడు అనిపించుకున్నా, నటుడిగాను .. రచయితగాను సక్సెస్ అయినందుకు మాత్రం చాలా సంతోషంగా అనిపించింది. ‘గూఢచారి’ సినిమాలకి కథలను అందించింది నేనే’ అంటూ అడివి శేష్ చెప్పుకొచ్చాడు. అడవి శేష్ ప్రస్తుతం మేజర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈసినిమాను మహేశ్ బాబు నిర్మిస్తున్నారు.

- Advertisement -