విద్యాసంస్థలకు సెలవు..సీఎం కేసీఆర్ నిర్ణయం

33
- Advertisement -

భారీ వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వర్షాల నేపథ్యంలో రేపు కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ముంపు ప్రభావిత ప్రాంతాల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దానికి అనుబంధంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గత మూడు రోజులుగా గ్రేటర్‌ హైదరాబాద్‌ వర్షంలో తడిసి ముద్దవుతున్నది. గురువారం కూడా భారీ వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ నగరానికి హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ కె.నాగరత్న హైఅలర్ట్‌ ప్రకటించారు. ఇవాళ రాత్రి గంటకు 5 సెం.మీ. నుంచి 6 సెం.మీ. వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు.

Also Read:మెగాస్టార్‌కి సర్జరీ నిజమే!

- Advertisement -