భారీ వర్షాలు…పరీక్షలు రద్దు

66
ou
- Advertisement -

రాష్ట్రంలో ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నగరంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇక ఇప్పటికే ప్రభుత్వం విద్యాసంస్థలకు మూడు రోజులు సెలవులు ప్రకటించగా తాజాగా కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీల పరిధిలో జరగాల్సిన పరీక్షలు వాయిదాపడ్డాయి. ఎ

ఉస్మానియా యూనివర్సిటీ నేటి నుంచి మూడు రోజులపాటు సెలవులు ప్రకటించింది. దీంతో సోమవారం నుంచి బుధవారం వరకు జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసింది. ఈనెల 14 నుంచి జరగాల్సిన పరీక్షలు యథాతథంగా ఉంటాయని అధికారులు తెలిపారు.

కాకతీయ వర్సిటీ పరిధిలో సోమ, మంగళవారాల్లో జరగాల్సిన డిగ్రీ, పీజీ పరీక్షలను అధికారులు వాయిదావేశారు. పరీక్షలను మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామనే విషయాన్ని త్వరలో వెల్లడిస్తామని రిజిస్ట్రార్‌ ప్రకటించారు.

- Advertisement -