మరో రెండు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు..

323
rains
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌,తెలంగాణల్లో నైరుతి రుతుపవనాల కదలికలు చురుకుగా ఉండటంతో, నేడు, రేపు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని.. చాలా ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది.

శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, వరంగల్, కర్నూల్, గుంటూరు, ప్రకాశం, నిజామాబాద్, పశ్చిమ గోదావరి, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షం కురిసిందని అధికారులు పేర్కోఒన్నారు. నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతుండడం, ఆగ్నేయ బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురుస్తున్నాయన్నారు. దీని ప్రభావంతో రానున్న 4 రోజుల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అటు విశాఖపట్నం వాతావరణ కేంద్రం కూడా తెలిపింది.

- Advertisement -