మంచి నీళ్లు..జీర్ణక్రియ ప్రక్రియ

422
- Advertisement -

మనం మంచి నీళ్ళు ఎప్పుడు, ఎంత, ఎలా , ఏ విధముగా త్రాగాలి? రోగం వచ్చాక చికిత్సకంటే, రోగాల బారిన పడకుండా ఉండటమే ఎంతో ప్రధానము అంటారు మహర్షి వాగ్భటాచార్యుడు. అయితే అలాంటి నీళ్లు ఎంత సమయంలో జీర్ణం అవుతాయో తెలుసా. వెంటనే. అంటే నీళ్లు జీర్ణం అవడానికి ఒక్క నిమిషం కూడా సమయం పట్టదు.

నీటిని గుటక గుటకగా త్రాగాలి . ఒక్కొక్క గుటక నోటిలో నింపుకుంటూ చప్పరిస్తూ త్రాగాలి. వేడి వేడి పాలు త్రాగే విధంగా నీటిని త్రాగాలి. నీరు ఎపుడు త్రాగినా ఈ విధంగానే త్రాగాలి . ఇది నీరు త్రాగే సరైన విధానం. గటగటా నీరు త్రాగడం మంచి విధానం కాదు.

ఫలితము:
నీటిని గుటక గుటక చప్పరిస్తూ త్రాగితే నోటిలోన వున్న లాలాజలంతో నీరు కలిసి కడుపులోకి చేరుతుంది. పొట్టలో ఆమ్లాలు తయారవుతాయి. లాలాజలం పొట్టలోని ఆమ్లాలతో కలిసి న్యూట్రల్ అవుతుంది. అసలు నోటిలో లాలాజలం తయారయ్యేది పొట్టలోకి వెళ్ళటానికి, లోపలి ఆమ్లాలని శాంతింప చెయ్యటానికి, అప్పుడు మనం జీవితాంతం ఏ రోగాల బారినపడకుండా ఆరోగ్యంగా జీవించ వచ్చును.

బ్రేక్ ఫాస్ట్ లేక భోజనమునకు గంట ముందు నీళ్ళు త్రాగాలి. బ్రేక్ ఫాస్ట్ లేక భోజనం చేసిన గంటన్నర తరువాత నీళ్లు త్రాగాలి. ఆహారం జఠర స్ధానంలో గంటన్నర వరకు ఆగి ప్రదీప్తమై ఉంటుంది. అప్పుడు ఆహారం సక్రమంగా జీర్ణమవుతుంది‌. భోజనం మధ్యలో నీరు త్రాగాలనిపిస్తే 2 లేక 3 గుటకల నీరు త్రాగవచ్ఛును. భోజనం ముగించాక గొంతు శుద్ధి కోసము, గొంతు సాఫీగా ఉంచటానికి 2 లేక 3 గుటకల నీరు త్రాగవచ్చును. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లేక భోజనం తరువాత పండ్ల రసాలు త్రాగవచ్ఛును. మధ్యాహ్న భోజనం తరువాత మజ్జిగ త్రాగవచ్చును. రాత్రి భోజనాంతరము పాలు త్రాగవచ్చు. ఈ క్రమాన్ని ముందు వెనుకలుగా చెయ్యవద్దు. ఎందుకంటే ఆయా రసాలను పచనం చేసే ఎంజైమ్స్ ఆ సమయాల్లో మాత్రమే మన శరీరంలో ఉత్పన్నమవుతాయి .

Also Read:కూరగాయలతో జీర్ణశక్తి మెరుగు..

ఎలా త్రాగాలి:
ఎల్లప్పుడూ సుఖాసనంలో కూర్చొని గుటక గుటకగా చప్పరిస్తూ త్రాగాలి. నిలబడి నీళ్ళు త్రాగరాదు. చల్లని నీళ్ళు త్రాగరాదు. గోరు వెచ్చని నీళ్ళు త్రాగవలెను. ఎండాకాలములో ( మార్చి నుండి జూన్) మట్టికుండలోని నీరు త్రాగవలెను. మూత్ర విసర్జన తర్వాత నీళ్ళు త్రాగరాదు. మల విసర్జన తర్వాత నీళ్ళు త్రాగరాదు. స్నానం చేసిన వెంటనే నీళ్ళు త్రాగరాదు. మూత్ర విసర్జన తర్వాత నీళ్ళు త్రాగితే మూత్ర సంబంధ వ్యాధులు వస్తాయి. మల విసర్జన తర్వాత నీళ్ళు త్రాగిన యెడల మలబద్ధకం వస్తుంది. స్నానం చేసిన వెంటనే నీళ్ళు త్రాగిన యెడల చర్మ వ్యాధులు లేక ఉబ్బసం వంటి జబ్బులు వస్తాయి. ఎండ నుండి నీడకు వచ్చి వెంటనే నీళ్ళు త్రాగితే సమస్యలు వస్తాయి.  రిఫ్రిజిరేటర్ నీళ్ళు చాలా హానికరము.

మనకు ఆహారము ఎంత ప్రధానమో, తిన్న ఆహారము సక్రమంగా జీర్ణమవటం అంతే ప్రధానము. మనము తిన్న భోజనము జీర్ణము కాని యెడల అది కుళ్ళిపోతుంది. ఆ కుళ్ళిన ఆహారము వలన శరీరంలో విషవాయువులు పుట్టి 103 రోగాలకు కారణం అవుతుంది. మొట్టమొదట గ్యాస్ ట్రబుల్, గొంతులో మంట, గుండెలో మంట , ఎసిడిటీ , హైపవర్ ఎసిడిటీ , అల్సర్ , పెప్టిక్ అల్సర్ మొదలగునవి వస్తాయి. చివరగా క్యాన్సర్ కి దారి తీస్తుంది.

Also Read:అమరుల యాదిలో అమరజ్యోతి..

మీరు ఎల్లప్పుడూ నీటిని గుటక గుటకగా చప్పరిస్తూ త్రాగిన యెడల , మీరు జీవితంలో ఏ రోగాల బారిన బడరు. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా వుంటారు.ఈ సృష్టిలో ప్రతి జంతువు నీటిని చప్పరిస్తూ ఒక్కొక్క గుటకగా త్రాగుతుంది.

- Advertisement -