హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

488
suside
- Advertisement -

నిజామాబాద్ జిల్లాలో హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ రివాల్వర్ తో కాల్చుకుని మరణించాడు. దీంతో అతన్ని వెంటనే నిజామాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. జిల్లాలోని ఇందల్వాయి పోలీస్ స్టేషన్ లో గత కొద్ది రోజులుగా ప్రకాశ్ రెడ్డి అనే హెడ్ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నాడు. ఎస్ ఐ తన రివాల్వర్ ను స్టేషన్ లోనే వదిలి వెళ్లడంతో దాంతో కాల్చుకుని మరణించాడు.

పోలీస్ స్టేషన్ లో ఎవరు లేని సమయంలో ప్రకాశ్ రెడ్డి గన్ తో కాల్చుకున్నారు. ఒక్క సారిగా శబ్దం రావడంతో బయట ఉన్న మిగతా సిబ్బంది లోపలకు వచ్చి ప్రకాశ్ రెడ్డిని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతను మరణించినట్లు తెలిపారు వైద్యులు. ఇక ప్రకాశ్ రెడ్డి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -