మంత్రి సబితను కలిసిన హెచ్‌సీఏ చీఫ్ అజార్‌

458
azaruddin
- Advertisement -

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) అధ్యక్షుడు అజారుద్దీన్, ప్యానెల్ సభ్యులు ఇవాళ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా హెచ్ సి ఏ అధ్యక్షుడిగా ఎన్నికైన అజారుద్దీన్ కు శుభాకాంక్షలు తెలిపారు సబితా ఇంద్రారెడ్డి. అంతకముందు టీఆర్ఎస్ నేత కార్తీక్ రెడ్డితో కలిసి కేటీఆర్‌ని కలిశారు అజార్.

హెచ్‌సీఏ ఎన్నికల్లో అజార్ ప్యానెల్ ఘన విజయం సాధించింది. అధ్యక్షుడిగా అజారుద్దీన్, ఉపాధ్యక్షుడిగా జాన్ మనోజ్, కార్యదర్శిగా విజయానంద్, జాయింట్ సెక్రటరీగా నరేశ్, ట్రెజరర్‌గా సురేంద్ర కుమార్ అగర్వాల్, కౌన్సిలర్‌గా అనురాధ విజయం సాధించారు.

- Advertisement -