మూడేళ్ల తర్వాత పునరాగమనం చేసిన యువీ తన సత్తాచాటాడు. ఒత్తిడిని జయిస్తు సిసలైన బ్యాటింగ్తో అభిమానులను అలరించాడు. శతకం చేయగానే కాస్త భావోద్వేగానికి గురయ్యాడు. బ్యాట్ను డ్రెస్సింగ్ రూమ్ కేసి చూపించి తనలో పోరాట పటిమ ఇంకా తగ్గలేదని నిరూపించుకున్నాడు. యువీ అసాధారణ సెంచరీపై క్రికెట్ అభిమానుల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక తన భర్త ఆటతీరును చూసి అతని భార్య హాజెల్ కీచ్ మురిసిపోయింది. తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకుంది. యువీ పేరు మధ్యలో ఫియర్స్ అనే పదం ఉంటే బాగుండేదన్నారు. 127 బంతుల్లో 150 పరుగులు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. ఇంగ్లండ్ పై ఇండియా 2-0తో గెలిచింది. క్యాన్సర్ నుంచి కోలుకోవడమే కాదు జట్టులో కూడా స్థానం సంపాదించాడు. క్యాన్సర్ నుంచి కోలుకోవడం వేరు … క్యాన్సర్ ను జయించడం వేరు అని హాజెల్ ట్వీట్ చేసింది.
ఇంగ్లండ్ తో జరిగిన రెండో వన్డేలో ఆకాశమే హద్దుగా చెలరేగిన యువీ కేవలం 127 బంతుల్లో 150 పరుగులు చేశాడు. సహచరుడు ధోనీతో కలసి ఇంగ్లీష్ బౌలర్లను చితకబాదాడు.ఆమె పోస్టుకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇన్స్టాగ్రామ్లో యువీ బ్యాటింగ్ ఫొటోతో ఆమె పెట్టిన కామెంటుకు ఇప్పటికి 25వేలకు పైగా లైక్లు వచ్చాయి.
సామాన్యుడికి ఇది సాధ్యం కాదని, యువరాజ్ మాత్రమే దాన్ని సుసాధ్యం చేసి చూపించాడని ఒకరు అంటే, నిజంగా నిజం హేజిల్.. అతడో హీరో.. అతడికి సెల్యూట్ చేస్తున్నా అని మరో యూజర్ కామెంట్ రాశారు. బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు మాజీ క్రికెటర్లు యువీని సైతం ఆకాశానికెత్తేశారు.