కెప్టెన్‌గా 150వ T20..పాక్‌పై!

1
- Advertisement -

మహిళల ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై సాధించిన విజయం తర్వాత, భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తమ జట్టు విజయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అలాగే తన 150వ T20I మ్యాచుల్లో ఒక దేశానికి ప్రాతినిధ్యం వహించిన తొలి క్రికెటర్‌గా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తాను ఇంతవరకు వస్తానని ఎప్పుడూ ఊహించలేదని చెప్పారు.

శనివారం దుబాయ్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు బౌలింగ్‌తో పాకిస్థాన్‌ను కుప్పకూల్చగా, హర్మన్‌ప్రీత్ విన్నింగ్ రన్స్ చేసి కెప్టెన్‌గా తన 150వ మ్యాచ్‌ను ఘనంగా జరుపుకున్నారు. ఈ విజయంతో భారత్ గెలుపు ఊపుతో నాకౌట్ రౌండ్‌లోకి అడుగుపెట్టింది.

మన ప్రమాణాలను అత్యున్నతంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. మైదానంలోకి దిగినప్పుడు ఈ జట్టు సామర్థ్యం ఏంటో మాకు తెలుసు. ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి మంచి ప్రదర్శన ఇస్తుండటం నాకు చాలా సంతోషంగా ఉంది. రాబోయే రెండు మ్యాచ్‌ల్లో కూడా మా అత్యుత్తమ క్రికెట్‌ను ఆడతామని ఆశిస్తున్నాను. నేను ఇంతవరకు వస్తానని ఎప్పుడూ అనుకోలేదు, కానీ నా వెనుక ఉండి నన్ను ప్రోత్సహించిన ప్రజలందరికీ నేను కృతజ్ఞురాలిని అని తెలిపారు.

3/7 అత్యుత్తమ ప్రదర్శనతో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ సాధించిన శ్రీ చరణి మాట్లాడుతూ, జట్టు విజయంలో భాగస్వామిని కావడం చాలా గొప్ప భావన. నా శ్రమను బౌలింగ్‌లో చూపుతూ దేశం కోసం మరింత ప్రదర్శన ఇవ్వాలనుకుంటున్నాను అన్నారు.

పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనా మాట్లాడుతూ తమ బ్యాటింగ్ విఫలమైందని, ఓటమి తీవ్రంగా నిరాశపరిచిందని చెప్పారు. పాకిస్థాన్‌ను కేవలం 55 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్, 8.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ (18 నాటౌట్), దీప్తి శర్మ (12 నాటౌట్) క్రీజులో ఉండి విజయాన్ని అందించారు. గ్రూప్ స్టేజ్‌లో థాయిలాండ్, హాంగ్‌కాంగ్ మరియు పాకిస్థాన్‌లను ఓడించి భారత్ వరుసగా మూడు విజయాలతో సెమీఫైనల్ చేరింది.

Also Read:సైనా నెహ్వాల్..సరికొత్త ఛాలెంజ్

- Advertisement -