పార్లమెంట్ఆవరణలో మెక్కలు నాటిన ఎంపీ సంతోష్‌ కుమార్‌

421
telangana mps
- Advertisement -

పార్లమెంట్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ,కేంద్రమంత్రులతో పాటు తెలంగాణ ఎంపీలు సంతోష్ కుమార్‌, టీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత నామా, కేకే, బండ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. కేంద్రమంత్రులతో కలిసి ఎంపీ సంతోష్ మొక్కలు నాటారు.

తెలంగాణ ఎంపీల ఆహ్వానం మేరకు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్, కేంద్ర సమాచార, ప్రసార శాఖ, అడవులు, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ లు మొక్కలు నాటారు. ఎంపీ సుప్రియా సూలే, మరో ఎంపీ, నటి సమలతలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తెలంగాణకు హరితహారంలో భాగంగా గత ఐదేళ్లుగా రాష్ట్రంలో పచ్చదనం పెంపుకు తీసుకుంటున్న చర్యలు, అర్బన్ ఫారెస్ట్ పార్కుల అభివృద్దిని మంత్రులకు, ఇతర రాష్ట్రాలకు చెందిన సహచర ఎంపీలకు తెలంగాణ ఎంపీలు వివరించారు. హరితహారం కార్యక్రమం తనకు తెలుసునని, తెలంగాణ పర్యటనలో తాను స్వయంగా పాల్గొని మొక్కలు నాటిన విషయాన్ని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ గుర్తు చేసుకున్నారు.

ఇక పచ్చదనం పెంపులో భాగంగా తాను స్వయంగా హైదరాబాద్ శివారులో కీసర రిజర్వ్ ఫారెస్ట్ ను దత్తత తీసుకున్నట్లు, ఎంపీ లాడ్స్ నిధులతో అక్కడ ఎకో టూరిజంను కూడా అభివృద్ది చేయనున్న విషయాన్ని రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కేంద్రమంత్రులకు, ఎం.పీలకు వివరించారు. మంచి ప్రయత్నమంటూ వారందరూ సంతోష్ ను అభినందించారు.

- Advertisement -