టీయూలో హరిత హారం

120
tu
- Advertisement -

తెలంగాణ విశ్వవిద్యాలయం గౌరవ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ గారి 61 వ జన్మదినోత్సవం సందర్భంగా అతిథి గృహం ఎదురుగా మొక్కలు నాటారు. గ్రీన్ చాలెంజ్ లో భాగంగా మర్రి, రావి, కదంబ, తాబాదియా రోజా, అల్లానేరేడు, ఉసిరి, కానుగ, వేప మొక్కలు దాదాపు 150 వరకు విశ్వవిద్యాలయ సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు.

ఈ కార్యక్రమంలో వీసీ దంపతులు ఆచార్య డి. రవీందర్, సతీమణి శ్రీమతి సౌభాగ్యలక్ష్మి, రిజిస్ట్రార్ ఆచార్య నసీం, ప్రిన్సిపల్ డా. వాసం చంద్రశేఖర్, డీన్ ప్రొ. యాదగిరి, ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొ. కనకయ్య, డీన్ ప్రొ. అత్తర్ సుల్తానా, ప్రొ. అరుణ, , ప్రొ. విద్యావర్దిని కంట్రోలర్ డా. పాత నాగరాజు, పీఆర్ ఓ డా. వి. త్రివేణి, వైస్ ప్రిన్సిపల్ డా. శాంతాబాయి తదితర అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది హరితహారంలో పాల్గొని మొక్కలు నాటారు.

- Advertisement -