శ్రీ‌వారి స‌న్నిధిలో మంత్రి హ‌రీష్..

94
harish rao
- Advertisement -

తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు మంత్రి హ‌రీష్ రావు. ఇవాళ ఉద‌యం వీఐపీ విరామ స‌మంలో తన పుట్టిన‌రోజు సంద‌ర్భంగా స్వామివారిని ద‌ర్శించుకుని మొక్కులు చెల్లించారు. అనంత‌రం మాట్లాడిన హ‌రీష్‌..నేటితో తను 50వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా స్వామి వారి ఆశీస్సులు పొందడానికి తిరుమ‌ల వచ్చినట్లు తెలిపారు.

ఇక అంత‌క‌ముందు కాలిన‌డకన తిరుమల‌ చేరుకున్న హ‌రీశ్‌రావుకు టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం అందించగా, టీటీడీ ఆలయ అధికారులు స్వామివారి తీర్ధప్రసాదాలను, పట్టువస్త్రాలను అందజేశారు.

- Advertisement -