Harishrao:బీఆర్ఎస్‌కు ప్రజలంటే బాధ్యత

19
- Advertisement -

గజ్వేల్ నియోజకవర్గం మనోహరాబాద్ మండలంలోని జీడిపల్లిలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి మొక్కవోని పోరాటం వల్లే వచ్చిందన్నారు. చావు నోట్లో తల పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది కేసీఆరే అన్నారు. కేసీఆర్ లేకుండా తెలంగాణ లేదు, కేసీఆర్‌ను తెలంగాణను ఎవరూ వేరు చేయలేరని…తెలంగాణ వచ్చింది కాబట్టే మన నీళ్లు మనకు వచ్చినయి, మన గ్రామలు అభివృద్ధి చెందినాయన్నారు.

తెలంగాణ వచ్చింది కాబట్టే ఆసరా పెన్షన్ వచ్చింది, రైతుబంధు, రైతు బీమా వచ్చింది. కళ్యాణ లక్ష్మి వచ్చింది, దివ్యాంగుల పెన్షన్ వచ్చింది, కేసీఆర్ కిట్ వచ్చింది. ఇవన్నీ తెచ్చింది మన కేసీఆర్ అన్నారు.ప్రజాతీర్పును అంగీకరిస్తూ బీఆర్ఎస్ పార్టీకి వేసిన ప్రతి ఓటు కోసం కృతజ్ఞతతో పనిచేస్తాం అన్నారు. మనోహరాబాద్‌ను మండలం చేసింది కేసీఆర్. కాని ఇప్పుడొచ్చిన ప్రభుత్వం కొత్త మండలాలను, జిల్లాలను రద్దు చేస్తుందట అని ఆరోపించారు.

కొత్త విద్యుత్ పాలసీ తెస్తామని కాంగ్రెస్ అంటున్నది. కొత్త పాలసీ అంటే పాత కాంగ్రెస్ కరెంటు తెస్తారా! అని ప్రశ్నించారు. కేసీఆర్ రైతులకు ఇచ్చిన 24 గంటల కరెంట్ పై అబద్ధాలు చెబుతున్నారని….కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. గజ్వేల్‌ డెవలప్‌మెంట్ అథారిటీని రద్దు చేశారు. మనం చేసిన అభివృద్ధిని కక్షతో అడ్డుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుకుందాం… నెరవేర్చకపోతే ప్రజలు ఊరుకుంటరా? ఆలోచించాలన్నారు. కాంగ్రెస్‌కు ప్రజలంటే రాజకీయం, బీఆర్ఎస్‌కు ప్రజలంటే బాధ్యత. తెలంగాణ ప్రయోజనాల కోసం ఢిల్లీలో కొట్లాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనన్నారు.

ఓడినంత మాత్రన ప్రజలను వదిలేయం… వారి పక్షాన పోరాడతాం. బీఆర్ఎస్‌కు ప్రజలే దేవుళ్లు అన్నారు. బట్ట కాల్చి బీఆర్ఎస్ మీద వేస్తామంటే ప్రజలు ఊరుకోరు. ఆరోపణలు మాని ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని…ఎన్నికల హామీల అమలు కోసం ప్రజల పక్షాన అసెంబ్లీలో గట్టిగా పోరాడతాం అన్నారు.

Also Read:బాలయ్య సినిమా వర్కౌట్ అవుతుందా?

- Advertisement -