Harish:గురుకుల టీచర్‌ పోస్టుల భర్తీ ఎప్పుడు?

13
- Advertisement -

గరుకులాల్లో టీచర్ పోస్టులకు అప్లై చేసిన అభ్యర్థుల బాధలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. గురుకుల అభ్యర్థుల నిరసనకు మ‌ద్ద‌తు తెలిపిన హరీష్…వారి సమస్యలు తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

రాజకీయాలే పరమావధిగా నడుస్తున్న రేవంత్ సర్కార్‌కు గురుకుల టీచర్ పోస్టుల అభ్యర్థుల బాధలు కనిపించడం లేదా అన్నారు. మంత్రులు, అధికారులను కలిసి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా, సీఎం ఇంటి ముందు మోకాళ్ళ మీద నిలబడి ఎన్నిసార్లు అభ్యర్థించినా అభ్యర్థుల మొర అలకించకపోవడం శోచనీయమ‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం పోస్టులు భర్తీ చేసి, అభ్యర్థులకు, నిరుద్యోగులకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో 9210 టీచర్ పోస్టుల భర్తీకి గత బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నిరుద్యోగులకు నష్టం జరగకుండా ఉండాలని, ఒక్క పోస్ట్ కూడా మిగిలిపోవద్దనే లక్ష్యంతో ఉన్నత హోదా పోస్టుల నుండి ప్రారంభించి కింది స్థాయి పోస్టుల వరకు ఫలితాలు వెల్లడించి భర్తీ చేయాలని నిర్ణయించింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందుకు భిన్నంగా వ్యవహరించడంతో ఒకే అభ్యర్థికి ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు వచ్చాయి. దీంతో దాదాపు 2500 పైగా టీచర్ పోస్టులు మిగిలిపోయాయి.

Also Read:Kaushik Reddy:పొన్నం నుండే బ్లాక్ బుక్‌ స్టార్ట్

- Advertisement -