Harishrao:కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటాం

34
- Advertisement -

రాష్ట్రమంతా కొంత ఇబ్బంది ఉన్నా సంగారెడ్డిలో మాత్రం ఈ సారి గులాబీ జెండా ఎగిరిందన్నారు మంత్రి హరీష్ రావు. సంగారెడ్డి బీఆర్ఎస్ కృతజ్ఞత సభలో మాట్లాడిన హరీష్..చింతా ప్రభాకర్ ఆరోగ్యం దెబ్బ తిన్నా ప్రతి ఒక్క కార్యకర్త అభ్యర్థి గా కష్టపడి పని చేశారన్నారు. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం అన్నారు. దురదృష్టవశాత్తు మన ప్రభుత్వం ఏర్పడలేదు..మనం కుంగిపోవాల్సిన అవసరం లేదన్నారు.

వచ్చే పంచాయతీ ఎన్నికలు, ఎంపీ ఎన్నికల్లో మన సత్తా చూపించాలని..అధికార పార్టీ వాళ్ళు మన మానసిక స్టైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తారన్నారు. TRS పార్టీ పెట్టినప్పుడు కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డాం…2004 లో కాంగ్రెస్ మనతో పొత్తు పెట్టుకుని తెలంగాణ ఇవ్వలేదన్నారు. తెలంగాణపై కేసీఆర్ కి ఉన్న ప్రేమ ఇతరులకు ఉండదని…14 ఏళ్ళు కష్టపడి, పదవులు గడ్డి పోచల్లా వదిలేసి తెలంగాణ తెచుకున్నాం అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు పొంగిపోలేదు..లేనప్పుడు కుంగిపోలేదన్నారు.

BRS అధికార పక్షంలో ఉన్న ప్రతి పక్షంలో ఉన్న మనమెప్పుడు ప్రజల పక్షమేనన్నారు. తెలంగాణని అన్ని రంగాల్లో దేశంలో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టింది BRS అని…ప్రజలు కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చారు..వాళ్ళు మనకంటే బాగా చేయాలని కోరుకుందాం అన్నారు. కేవలం 2 శాతం ఓట్ల తేడాతో మనం ఒడిపోయాం అని…ప్రజలకిచ్చిన హామీల కోసం కొట్లాడుదాం అన్నారు. భవిష్యత్తు మనకే ఉంటుంది..కార్యకర్తలు ఎవరు కూడా అధైర్య పడొద్దు అన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు…అందరం కలసి పని చేద్దాం…ఓటమిపై సమీక్ష జరుపుదాం…తప్పు ఒప్పులు సరి చేసుకుందాం అని పిలుపునిచ్చారు.

Also Read:శ్రీవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం భట్టి

- Advertisement -