Harishrao:మెదక్‌లో ఓడిపోవడం బాధాకరం

25
- Advertisement -

మెదక్‌లో బీఆర్ఎస్ ఓడిపోవడం బాధాకరమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మెదక్ పట్టణంలోని వైస్రాయ్ గార్డెన్స్ లో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లా డిన ఆయన..ఎన్నికల్లో కష్టపడి పనిచేశారు కృతజ్ఞతలు చెప్పాలనే సమావేశం ఏర్పాటుచేశాం అన్నారు. తక్కువ మెజార్టీతోనే మెదక్ లో ఓడిపోయాం…మెదక్ పార్లమెంట్ పరిధిలో ఆరు స్థానాలు గెలిచాం అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నేను వచ్చి పనిచేసి గెలిపిస్తా…మీరంతా నా కుటుంబ సభ్యులే.. మీకు ఏ ఆపద వచ్చినా నేనుంటా అన్నారు.

బీఆర్ఎస్ 20 గంటల కరెంట్ ఇచ్చిందని అసెంబ్లీ లో కాంగ్రెస్ వాళ్లు చెప్పారు…రూ 50 వేల కోట్లు విద్యుత్ శాఖకు ఖర్చు చేసి రైతులకు కరెంట్ ఇచ్చాం అన్నారు. ఏంఎన్ కెనాల్, ఎఫ్ఎన్ కెనాల్ లలో తుమ్మ చెట్లు మొలిస్తే బాగుచేశాం అని…హైదరాబాద్ కు గోదావరి నీళ్లు తెచ్చి మెదక్ జిల్లాకు సింగూరు జలాలు ఇచ్చాం అన్నారు. ఎప్పుడైనా కాంగ్రెసోళ్లు చెక్ డ్యామ్ లు కట్టారా..?,కాళేశ్వరం, కొండపోచమ్మల ద్వారా సాగునీరు ఇస్తున్నాం…కేసీఆర్ అంటే నమ్మకం..బీఆర్ఎస్ అంటే విశ్వాసం అన్నారు.

కరోనా వచ్చినా రైతులకు రైతు బంధు వేశాం అని.. బీఆర్ఎస్ పాలనలో ఏ ప్రభుత్వ పథకం ఆగలేదన్నారు. రైతు బంధు కింద 13 సార్లు రూ. 72 వేల కోట్లు ఇచ్చామని,రైతు భీమా ద్వారా రైతు కుటుంబాన్ని కాపాడింది బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. రైతు బీమా దండగ అని అసెంబ్లీ లో కాంగ్రెసోళ్లు మాట్లాడటం సిగ్గుచేటని…కాంగ్రెసోళ్లు అసెంబ్లీ లో అన్నీ జుటా మాటలు మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణ కోసం నేను మెదక్ జైల్లో మూడు రోజులున్న,తెలంగాణ కోసం పోరాడింది బీఆర్ఎస్ అన్నారు. తెలంగాణతో బీఆర్ఎస్ ది పేగుబంధం అని,తెలంగాణ కోసం రాజీనామాలు చేసింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణ ప్రజల మీద కమిట్మెంట్ తో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ అన్నారు. మెదక్ ఎంపీ గెలవడం పక్కా,ఎవరు అధైర్య పడద్దు..భవిష్యత్ మనదేనన్నారు.

Also Read:కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు:సీఎం రేవంత్

- Advertisement -