జీఎస్టీ పరిహారం కేంద్రమే చెల్లించాలి: హరీష్ రావు

258
harishrao
- Advertisement -

జీఎస్టీ లో చేరడం వల్ల రాష్ట్రాల ఆదాయానికి ఎలాంటి నష్టం వాటిల్లదని కేంద్ర ప్రభుత్వం హమీ ఇచ్చినందువల్లే జీఎస్టీలో అన్ని రాష్ట్రాలు చేరాయి.జీఎస్టీ పరిహారం చెల్లించే బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదే….రాష్ట్రాలు జీఎస్టీలో చేరవడం వల్ల 60 నుంచి 70 శాతం ఆదాయాన్ని కోల్పోయాయి. కేంద్రం మాత్రం 31 శాతం మాత్రమే కోల్పోయింది. అందు వ ల్ల రాష్ట్రాలకు కేంద్రం జీఎస్టీ పరిహారం చెల్లించాల్సిందేనని మంత్రి హరీశ్ రావు అన్నారు.

గతంలో జరిగిన 7వ, 8వ, 10వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశాల్లో జీఎస్టీ ఆదాయంలో రాష్ట్రాలకు లోటు ఏర్పడితే కేంద్ర ప్రభుత్వం ఏదో రూపంలో పరిహారం చెల్లిస్తుందని చెప్పారు. కన్సాలిడెటెడ్ ఫండ్ నుండి లేదా, అప్పు తీసుకుని అయినా చెల్లిస్తామని హమీ ఇచ్చారు. దీనిపై చర్చ అనవసరం.జీఎస్టీ పరిహారంలో సెస్ మిగిలితే కేంద్రం కన్సాలిడేటెడ్ ఫండ్ లో జమ చేసి వాడుకుంటోంది, సెస్ తగ్గినపుడు రాష్ట్రాలు అప్పులు తీసుకోవాలని సూచించడం సమంజసం కాదు.కేంద్రమే జీఎస్టీ పరిహారం చెల్లించాలి. రాష్ట్రాలు అప్పులు తీసుకుంటే రాష్ట్రానికో వడ్డీ రేటు ఉంటుంది. ఎంత కాల పరిమితితో తీసుకోవాలి, ఎన్ని సంవత్సరాలు చెల్లించాలి , ఎఫ్.ఆర్. బీ.ఎం పరిమితులు వంటి సమస్యలు తలెత్తుతాయి. చెల్లింపుల్లోను గందర గోళం తలెత్తుంది.

కేంద్ర ప్రభుత్వమే అప్పు తీసుకుని రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం చెల్లించాలి. కేంద్రమే అప్పు తీసుకుంటే వడ్డీ రేటు తగ్గుతుంది.కోవిడ్ ఎంత కాలం ఉంటుందో తెలియని పరిస్థితి దేశంలో నెలకొంది. రెవెన్యూ లోటు ఎంతో ఉంటుందో అర్థం కాని పరిస్థితి ఉంది. ఈ స్థితిలో ఆర్థిక పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయో తెలియని అయోమయంలో అందరూ ఉన్నారు.కాబట్టి కేంద్రమే బాధ్యత తీసుకుని గతంలో హమీ ఇచ్చినట్లు రెండు నెలలకొసారి జీఎస్టీ పరిహారం చెల్లించాలి.

ఐజీఎస్టీకి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి 2700 కోట్లు రావాల్సి ఉంది. బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోడీ ఆధ్వర్యంలోని సబ్ కమిటీ సమావేశమై విధి విధానాలు రూపొందించాలి. వెంటనే ఈ మొత్తాన్ని విడుదల చేయాలి.అత్యధికంగా జీఎస్టీ చెల్లించే ఐదు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. అత్యంత తక్కువ పరిహారం తీసుకునే రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా ఉంది.ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం 18 వేల 82 కోట్లు జీఎస్టీ సెస్ రూపంలో కేేంద్రానికి చెల్లిస్తే, తీసుకున్నది కేవలం 3 వేల223 కోట్లు మాత్రమే.

జీఎస్టీ పరిహారం చెల్లింపుల విషయంలో కోవిడ్ పరిస్థితులని, జీఎస్టీ అమలు వల్ల నష్టమన్న పేరుతో విభజించడం వల్ల తెలంగాణ తీవ్రంగా నష్టపోతుంది. రాష్ట్రానికి ఇవ్వాల్సిన సెస్ ను పూర్తి స్థాయిలో చెల్లించాలని మంత్రి హరీశ్ రావు గట్టిగా నొక్కి చెప్పారు.తెలంగాణ లాంటి అభివృద్ధి చెందుతున్న రాష్ట్రానికి ఇలా కోవిడ్ అని, జీఎస్టీ అమలు వల్ల వచ్చిన నష్టమని చెబితే ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతుంది. జీఎస్టీ అమలు చేసిన మొదటి సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం 169 కోట్లు మాత్రమే పరిహారం తీసుకుంది. రెండో ఏడాది పరిహారం సున్నా. మూడో ఏడాది స్వల్ప మొత్తమే పరిహారంగా దక్కింది. సెస్ వచ్చే ఈ ఏడాది కోవిడ్ అని, జీఎస్టీ అమలు వల్ల నష్టమని విభజిస్తే తీవ్రంగా నష్టం పోతాం. రాష్ట్రానికి రావాల్సిన సెస్ మొత్తం చెల్లించాలని మంత్రి హరీశ్ రావు గట్టిగా డిమాండ్ చేశారు.

కేంద్రం అనుసరించే ఈ విధానం వల్ల పకృతి వైపరిత్యాలకు గురయిన రాష్ట్రాలు, ఆర్థిక నిర్వహణ సరిగా లేని రాష్ట్రాలకు లబ్ధి చేకూరుతూ, అభివృద్ధి దిశగా అడుగులు వేసే తెలంగాణ వంటి రాష్ట్రాలకు నష్టంగా పరిణమిస్తుంది.15వ ఆర్థిక సంఘం కేటాయింపుల్లో కూడా తెలంగాణకు నష్టం జరిగింది.

కేంద్రం ప్రతిపాదనలు

….

అన్ని రాష్ట్రాల అభిప్రాయం తెలుసుకున్న జీఎస్టీ కౌన్సిల్ రెండు ప్రతిపాదనలు రాష్ట్రాల ముందుంచింది.

ప్రతిపాదన-1 – కేంద్ర ప్రభుత్వమే రుణం తీసుకుని రాష్ట్రాలకు ఇవ్వనుంది. ఈ ప్రతిపాదనలో కేవలం జీఎస్టీ అమలులో ఏర్పడిన రెవెన్యూ లోటు లక్షా 65 వేల కోట్లు రాష్ట్రాలకు ఇవ్వడం జరుగుతుంది.

ప్రతిపాదన

ప్రతిపాదన 2- జీఎస్టీ, కోవిడ్ కారణాల వల్ల ఏర్పడిన రెవెన్యూ లోటు 3 లక్షల కోట్లను రుణంగా తీసుకుని రాష్ట్రాలకు చెల్లించడం జరుగుతుంది. ఈ రుణం రాష్ట్రాల పేరు మీద జీఎస్టీ కౌన్సిల్ తీసుకుని వడ్డీతో సహా రుణాన్ని చెల్లించడం జరుగుతుంది.

ఈ రెండు ప్రతిపాదనపై ఏడు పని దినాలలో రాష్ట్రాలు తమ అభిప్రాయాలను వెళ్లడించాలని జీఎస్టీ కౌన్సిల్ ఛైర్ పర్సన్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు.ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఈ సమావేశంలో వ్యక్తపరిచిన అభిప్రాయాలను చాలా రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ప్రస్తావించడం తో పాటు గట్టి మద్ధతును తెలిపారు.ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి హరీశ్ రావుతో పాటు సీఎస్ సోమేష్ కుమార్, ఆర్థిక, వాణిజ్య, పన్నుల శాఖ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -