Harishrao:మేడిగడ్డపై అసత్య ప్రచారం

24
- Advertisement -

శాసన సభ జరిగిన జరుగుతున్న తీరు ఖండిస్తున్నా అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన హరీష్..మీరు మాట్లాడి, మాకు మైకులు మాకు ఇవ్వక పోవడం సభా సంప్రదాయాలకు విరుద్ధం అన్నారు. ప్రజాస్వామ్య విలువలు మంట గలిపే విధంగా ఉంది ప్రభుత్వం తీరు ఉందని..కాళేశ్వరం సమగ్ర స్వరూపం చాలా మందికి తెలియదు. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటి కెనాల్, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టిఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, 240 టిఎంసీల ఉపయోగం… వీటన్నింటి సమాహారం కాళేశ్వరం అన్నారు.

ఒక బ్యారేజీలో ఒకటి రెండు కుంగి పోతే కోడి గుడ్డు మీద ఈకలు పీకుతున్నారన్నారు. మీరు వెళ్ళే దారిలో రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కుడెల్లి వాగు, పచ్చటి పొలాలు చూడండన్నారు. కాళేశ్వరం ఫలితాలు రైతును అడగండి. కర్ణాటక నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వచ్చి రంగనాయక సాగర్ చూశారు. అద్బుతం అని మెచ్చుకున్నారు. నేర్చుకున్నారు…చాప్రాల్ వైల్డ్ లైఫ్ ప్రాంతంలో ప్రాణహిత కట్టాలని చూస్తే అనేక అడ్డంకులు…కేంద్రం, మహారాష్ట్ర, ఏపీలో నాడు కాంగ్రెస్ అధికారంలో ఉంది ఎందుకు ప్రాణహిత చేవెళ్ల కట్టలేదు అన్నారు.

మేము నీళ్ళు లేని నుండి నీళ్ళు ఉన్న దగ్గరకు మార్చి ప్రాజెక్టు కట్టి నీళ్ళు అందించాం అని…మూడు కోట్ల మెట్రిక్ టన్నుల పంట పండింది అంటే ఆ జలాల వల్లే అన్నారు. తప్పు జరిగితే చర్య తీసుకోండి, పునరుద్దరణ పనులు చేయాలన్నారు. దురుద్దేశంతో ప్రాజెక్ట్ పునరుద్దరణ చేయడం లేదు. అద్భుతంగా నిర్మించి నీల్లు ఇస్తున్నాం అన్నారు.

రైతులకు ఇబ్బంది పెట్టకండి. నష్ట పోతారు. ప్రజలు క్షమించరన్నారు. కాంగ్రెస్ హయాంలో పంజాగుట్ట ఫ్లే ఓవర్ కూలి 20 మంది చనిపోయారని…దేవాదుల పైపులు పేలి నీళ్ళు ఆకాశమంత ఎగిరాయన్నారు. అలాంటి ఘటనలు జరగటం బాధాకరం. కానీ ముందుకు వెళ్ళాం కదా…ప్రాజెక్టులు అప్పగించ వద్దని మేము నిద్ర లేపితే లేచారన్నారు. ఈరోజు మా సభ ఉందని మీరు డైవర్ట్ కోసం పోటీ కార్యక్రమం పెట్టారు…మీ నీతిని ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు.

Also Read:ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన పోన్ నెంబర్స్!

- Advertisement -