ఎలక్ట్రీషియన్లకు బీమా కల్పించాలి:హరీష్

12
- Advertisement -

వరల్డ్ ఎలక్ట్రీషియన్ డే సందర్భంగా సిద్దిపేటలో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్స్ అసోసియేషన్ నిర్వహించిన కార్యక్రమంలో జెండాను ఆవిష్కరించారు మాజీ మంత్రి హరీష్ రావు. థామస్ ఆల్వా ఎడిసన్ కరెంటు బల్బును ఆవిష్కరించిన రోజుకు గుర్తుగా ఎలక్ట్రీషియన్ డే జరుపుకుంటున్నాం అన్నారు.

సిద్దిపేటలో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు కావడం సంతోషంగా ఉన్నది. అసోసియేషన్‌ భవన నిర్మాణానికి స్థలం, నిధులు అందజేశాం. ఎలక్ట్రీషియన్లకు ప్రమాద బీమా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతాం. మన జీవితాల్లో వెలుగు నింపే ఎలక్ట్రీషియన్లు తమ పనుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను. మీకు నా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు.

Also Read:Devara:’దేవర’ వాయిదా తప్పదా?

- Advertisement -