Harishrao:ఎన్నికల్లో గ్యారంటీ గారడీ..ఇప్పుడు అంకెల గారడీ

28
- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ పూర్తి ఆత్మస్తుతి, పరనిందగా ఉంది. ప్రజల ఆశలను వమ్ము చేశారు. హామీలకు కేటాయింపులు లేవు అని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్‌ రావు. రాష్ట్ర బడ్జెట్‌పై మీడియాతో మాట్లాడిన హరీష్‌…ఆరు గ్యాంరటీలకు కేటాయింపులు లేవు. అభివృద్ధి అగమ్య గోచరం. రాష్ట్రాన్ని తిరోగమనంలో నడిపే బడ్జెట్ ఇది అన్నారు. ఎన్నికల్లో గ్యారంటీల గారడీ.. ఇప్పుడు అంకెల గారడీ అని దుయ్యబట్టారు.

వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారంటీలకు బడ్జెట్లో కేటాయింపులేవీ? ,ఈ ప్రభుత్వ మొదటి బడ్జెట్లో ఎలాంటి దశా దిశాలేదు అని ఏడాదిలో 2 లక్షలు ఉద్యోగాలన్నారు. బడ్జెట్లో ఆ ప్రసక్తి లేదు అన్నారు. మేం అప్పులు చేశామని నిందించారు. భట్టి 57 వేల కోట్లు అప్పు తెస్తామన్నారు. మా ప్రభుత్వం తెచ్చినదానికంటే 17 వేల కోట్లు ఎక్కువ తెస్తామన్నారు,భట్టి ఆరుగ్యారంటీలను తన బడ్జెట్లో పూర్తిగా మరిచిపోయారన్నారు.

ఆరు గ్యారంటీల్లో మహిళలకు ఇస్తామన్న 2500 గురించి ప్రస్తావించలేదు. మహాలక్ష్మి పథకంపై బడ్జెట్ మహా నిరాశ కలిగించిందని,4 వేల ఫింఛన్ ఇస్తామని బాండు పేపర్ మీద రాశారు. మరి బడ్జెట్లో ఎందుకు ప్రస్తావించలేదు? అన్నారు. అత్యంత పేదలైన అవ్వాతాతలు, ఒంటరి మహిళలు, వింతంతువులు, దివ్యాంగుల ఆశలను మీ ప్రభుత్వం నీరుగార్చిందని, విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు. బడ్జెట్లో ఆ ప్రస్తావన లేదు అన్నారు. కొత్త రేషన్ కార్డుల ప్రస్తావన లేదు అని,
జాబ్ క్యాలెండర్, 4 వేల నిరుద్యోగ భృతి ప్రస్తావన కూడా లేదు అన్నారు.

ఆటో కార్మికులకు 12 వేలు ఇస్తామని హామీ ఇచ్చి బడ్జెట్లో మొండిచేయి చూపారని,ఆత్మహత్యలు చేసుకుంటున్న చేనేత కార్మికులకు గుండు సున్నా చూపారన్నారు.గత ప్రభుత్వం హైదరాబాద్ అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని అనడం అన్యాయం….కేసీఆర్ అభివృద్ధి పనులను తమ ఘనతగా చెప్పుకుంటున్నది కాంగ్రెస్ అన్నారు.దేశంలో తలసరి ఆదాయంలో 13 స్థానంలో ఉన్న తెలంగాణను మేం నంబర్ 1 స్థానంలో తీసుకొచ్చాం….తెలంగాణ తలసరి ఆదాయం 3 లక్షల 47 వేల 99 రూపాయలు అయితే , దేశ తలసరి ఆదాయం లక్షా 83 వేల 236 అన్నారు. అంటే రాష్ట్ర పౌరుడి తలసరి ఆదాయం దేశ తలసరి ఆదాయానికంటే 1 లక్ష 64 వేల 63 రూపాయలు ఎక్కువ. పదేళ్ల బీఆర్ఎస్ పరిపాలన ఫలితం. …బీఆర్ఎస్ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్ర స్థూల ఉత్పత్తి 4 లక్షల 51 వేల కోట్ల 580 కోట్లు. 2023-24 నాటికి అది 14 లక్షల 63 వేల 963 కోట్లు. అంటే మూడు రెట్లు పరిగింది. దేశం జీడీపీ కంటే 2 శాతం ఎక్కువ అన్నారు.

తెలంగాణ వృద్ధి రేటు 11.9 శాతం కాగా దేశ వృద్ధి రేటు 9.1 శాతమే. తెలంగాణ గ్రోత్ రేటు బావుందని నీతి ఆయోగ్ కూడా మెచ్చుకుందని,వ్యవసాయానికి ఊతమిచ్చి కోటి 27 వేల మెట్రిక్ టన్నుల వరి దిగుబడిని 4 కోట్ల మెట్రిక్ టన్నులకు పెంచాం అన్నారు.పంజాబ్‌ను తలదన్ని ఎదిగామంటే కేసీఆర్ పనితీరు కారణం కాదా? పండిన పంట నిజం కాదా? ,మీ బడ్జెట్లో ఏదో చెప్పినంత మాత్రాన నిజాలు నిజం కాకుండా పోతాయా? అన్నారు. బడ్జెట్లో గొల్ల కుర్మలకు మోసం చేశారు. గతేడాది 50 కోట్ల బడ్జెట్ పెడితే ఇప్పుడు సున్నా కేటాయించారు..పింఛన్లు పెంచడం లేదని అర్థమైంది. గతేడాది 7335 కోట్లు పెడితే, ఇపుడు 7376 కోట్లు మాత్రమే పెట్టారు. ఈసారి కొత్త పింఛన్ ఇవ్వరని తేలిపోయిందన్నారు. ఆగస్ట్ 15 కల్లా రైతు రుణమాఫీ చేస్తామన్నారు. 31 వేల కోట్లు ఇస్తామన్నారు. కానీ బడ్జెట్లో 15470 కోట్లు మాత్రమే కేటాయించారు? ఈ నిధులతో ఒకేసారి మాఫీ ఎలా సాధ్యం? అని ప్రశ్నించారు. మైనారిటీలకు 4 వేల కోట్లని మేనిఫెస్టోలో చెప్పి వెయ్యి కోట్లు మాత్రమే కేటాయించారు. ఐదేళ్లలో ప్రతి సంవత్సరానికి బీసీలకు 20 వేల కోట్ల ఇస్తామని చెప్పి 9 వేల కోట్లు మాత్రమే కేటాయించారన్నారు.

Also Read:జూలై 28న కల్వకుర్తికి సీఎం రేవంత్

- Advertisement -