Harish:పార్టీని వీడుతున్న బ్రోకర్లు

10
- Advertisement -

ప‌వ‌ర్ బ్రోక‌ర్లు, అవ‌కాశ‌వాదులు పార్టీని విడిచి వెళ్లిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు. ఇది ఆకులు రాలేకాలం.. మ‌ళ్లీ కొత్త చిగురు వ‌చ్చి విక‌సిస్తుంది..కొంత‌మంది నాయ‌కులు పోవ‌చ్చు. తెలంగాణ రాష్ట్రం ఉన్నంత‌కాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటదని తేల్చి చెప్పారు.దుబ్బాక‌లో ఏర్పాటు చేసిన మెద‌క్ పార్ల‌మెంట్ విస్తృత స్థాయి స‌మావేశంలో హ‌రీశ్‌రావు పాల్గొని ప్ర‌సంగించారు.

అస‌లు రేవంత్ రెడ్డి జై తెలంగాణ అన్నాడా..? ఉద్య‌మంలో జై తెలంగాణ అన‌లేదు. ఇప్పుడు కూడా అన‌డం లేదు. కనీసం ఏనాడైనా అమ‌ర‌వీరుల స్థూపం వ‌ద్ద రెండు పూలు పెట్ట‌లేదు. తెలంగాణ మీద ప్రేమ లేదు ఆయ‌న‌కు. తెలంగాణ కోసం పోరాడింది మ‌నం. రాజ‌కీయంగా ల‌బ్ది పొందేందుకు వారు దుష్ర్ప‌చారం చేస్తున్నారన్నారు.

ఇప్పుడు ఎవ‌డైతే పార్టీ నుంచి పోయారో.. రేపు కాళ్లు మొక్కినా పార్టీలోకి రానిచ్చేది లేద‌ని పార్టీ నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఎట్టి ప‌రిస్థితుల్లో వారిని పార్టీలోకి రానిచ్చే ప‌రిస్థితి లేదు. క‌ష్ట‌కాలంలో పార్టీకి ద్రోహం చేస్తే క‌న్న‌త‌ల్లికి ద్రోహం చేసిన‌ట్టేనని దుయ్యబట్టారు. ఇ మెద‌క్ ఎంపీ స్థానంలో ఇప్పుడు కూడా బీఆర్ఎస్ గెలిచి తీరాల్సిందేనన్నారు.

Also Read:నేటి ముఖ్యమైన వార్తలివే..

- Advertisement -