కాంగ్రెస్‌కు ఓటేస్తే..కైలాసంలో పాము మిగినట్లే!

30
- Advertisement -

తప్పిపోయో, పొరపాటున కాంగ్రెస్ ఓటేస్తే కైలాసంలో పెద్దపాము మింగినట్టే ఉంటదన్నారు మంత్రి హరీష్ రావు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో మాట్లాడిన హరీష్.. కన్నతల్లికి అన్నం పెట్టలేనోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తా అన్నాడట..అలా రేవంత్ తీరు ఉందన్నారు. నడ్డా వచ్చి ఇక్కడ హంగ్ వస్తుంది అంటున్నాడని…నడ్డా హ్యాట్రిక్ కొడుతం రాసి పెట్టుకో అని సవాల్ విసిరారు.

మిస్టర్ నడ్డా తెలంగాణ గడ్డ.. కేసీఆర్ అడ్డా అని తెలిపిన హరీష్‌…సోషల్ మీడియాలో కాంగ్రెస్ ఫేక్ సర్వేలు పెడుతుందన్నారు. బీజేపీ జాకీ పెట్టిన తెలంగాణలో లేవదు…కాంగ్రెస్ గెలవదన్నారు. కేసీఆర్ దెబ్బకు బిజెపి డక్ ఔట్..కాంగ్రెస్ రన్ ఔట్..కేసీఆర్ సెంచరీ చేయడం పక్కా అన్నారు. కాంగ్రెస్ పార్టీకి 30 స్థానాల్లో అభ్యర్థులే లేరు…కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా వచ్చుడే ఎక్కువ అన్నారు. గత ఎన్నికల్లో 88 సీట్లు గెలిచాం..ఈ సారి 100 సీట్లు గెలిచి సెంచరీ కొడుతాం అని స్పష్టం చేశారు.

తెలంగాణ లో హిందూ ముస్లింలు కలిసి మెలిసి గంగ యమున తహజిబ్ తో ఎలాంటి సమస్యలు లేకుండా పరిపాలన చేస్తున్నారన్నారు.1270000 మంది పెళ్ళిళ్ళ కు కల్యాణ లక్ష్మి ద్వార సహాయం చేశామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వము లో జహీరాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని…అన్ని కులాల వారికి భవనల నిర్మాణం కోసం భూమి కేటాయించమని చెప్పారు.

Also Read:అజయ్ భూపతి.. ‘మంగళవారం’ సెకండ్ సాంగ్

జహీరాబాద్ లో 12 కోట్లతో మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి ఏర్పాటు చేశాం అని…పేదలకు వైద్యం అందుబాటులోకి తెచ్చామన్నారు. కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేస్తే తెలంగాణ అభివృద్ధి శూన్యమని…కర్ణాటక లో కాంగ్రెస్ పరిపాలన అన్ని సమస్యలే అన్నారు. కర్ణాటక కాంగ్రెస్ వాళ్ళ ఏమి చేయరు , కానీ తెలంగాణ లో మాత్రం చేస్తామని చెబుతారన్నారు.

- Advertisement -