Harishrao:రైతులతో మాది పేగు బంధం

37
- Advertisement -

రైతులతో మాది ఓటు బంధం కాదు పేగు బంధం అన్నారు మంత్రి హరీష్ రావు. జహీరాబాద్ నియోజకవర్గం ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన హరీష్..ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. అందరు కలిసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలన్నారు. రైతులకు పెట్టుబడి సాయం చేస్తుంటే బిచ్చమేస్తున్నరని కాంగ్రెస్ చెప్తోందని..రైతు బంధుకు ఈసీ పర్మిషన్ ఇచ్చిందని చెప్పినా. ఇందులో కొత్త విషయం ఏం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ చైర్మెన్ నిరంజన్ రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేసి రైతుల నోటికాడ బుక్క ఆపిండ్రు. ఎన్నిరోజులు ఆపుతరు. మూడు తారీకు తర్వాత వచ్చేది కేసీఆరే. తర్వాత రోజు టింగు టింగుమని పైసలు అకౌంట్ల పడతాయన్నారు.

2017లో రైతు బంధు ఇచ్చినప్పుడు ఓట్లు లేవు. ఓట్ల కోసం రైతు బంధు ఇవ్వట్లేదన్నారు. కర్ణాటకలో రైతు బంధును ఆపేసిన కాంగ్రెస్ పార్టీ అదే విధానాన్ని తెలంగాణలో అమలు చేస్తుంది. ఈ పార్టీకి రైతులు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ చేసిన రైతు బంధుపై కుట్రను వివరించాలని…తెలంగాణ రైతులు ఓటుతో కాంగ్రెస్ కి పోటు పొడవాలి. కాంగ్రెస్ పార్టీ ఖతం కావాలి. లేదంటే రైతు బంధు ఖతమైతదన్నారు.

మాణిక్ రావుని గెలిపిస్తే జహీరాబాద్ నియోజకవర్గానికి 6 వేల డబల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేస్తాం అన్నారు. సంగమేశ్వర ప్రాజెక్టు పూర్తి చేసి గోదావరి జలాలతో రైతుల కాళ్లు కడుగుతాం. లక్ష ఎకరాలకు నీళ్లిస్తాం అని..ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కేసీఆరే అన్నారు. రిస్క్ తీసుకోకుండా కారుకు ఓటెయ్యాలని…కాంగ్రెస్ అభ్యర్ధి నాన్ లోకల్. పైగా బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరి పోటీ చేస్తున్నాడు. మాణిక్ రావు లోకల్ అన్నారు. మాణిక్ రావును గెలిపిస్తే ఝరాసంగానికి జూనియర్ కాలేజ్ మంజూరు చేస్తాం అన్నారు.

Also Read:Anjali:గీతాంజలి మళ్లీ వచ్చింది

- Advertisement -