Harishrao:గాంధీతో దాడి చేయించింది రేవంతే

3
- Advertisement -

రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయ్ అని మండిపడ్డారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. దీనంతటికి కారణం సీఎం రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు. అరెకపూడి గాంధీకి ఎస్కార్ట్ ఇచ్చి మా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పైన దాడి చేశారు.. ఖమ్మం లో మా ఎమ్మెల్యేలు పైన రాళ్ల దాడి చేస్తే ఇప్పటి వరకు ఎఫ్ ఆర్ నమోదు లేదు కాలేదన్నారు.

నల్గొండ కు వెళ్ళితే అక్కడ కేటీఆర్ బస్సు పైన దాడి చేశారు…ఏ ఒక్క విషయామాలోనైనా చర్య తీసుకున్నారా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలి…మీ మంత్రి తమనే రాళ్లతో కొట్టండి అంటున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిన్న గాంధీని హౌస్ అరెస్ట్ చేసి ఉంటే ఇలా జరిగేదా అని ప్రశ్నించారు. గాంధీతో దాడి చేయమని చెప్పిందే రేవంత్ రెడ్డి , ఇది గాంధీ చేయించిన దాడి గా మేము చూస్తాలేము ఇది రేవంత్ రెడ్డి చేసిన దాడిగా చూస్తున్నాం అన్నారు.

Also Read:హైడ్రా వెనక ఉందే చంద్రబాబు:కౌశిక్ రెడ్డి

- Advertisement -