Harishrao:నిరుద్యోగ యువతపై అరాచకం

0
- Advertisement -

నిరుద్యోగ యువతపై సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ అరాచకం చేస్తోందని మండిపడ్డారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. బందిపోట్లు, కిరాతకులు, దొంగలను కొట్టినట్లు నిరుద్యోగులను ఇష్టం వచ్చినట్లు కొడుతున్నారు…ఓట్లప్పుడు రాహుల్ గాంధీ అశోక్ నగర్ కు పోయి విద్యార్థులను బతిమిలాడారు. మరిప్పుడు ఆయన ఎక్కడికి పోయారు? అని ప్రశ్నించారు.

ఇప్పుడైతే పది వేలు, నేనొస్తే పదిహేను వేలు ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి… వానాకాలం దాటినా పదిహేను వేలు పడకపాయే, కేసీఆర్ ఇచ్చిన పది వేలు కూడా రాకపాయే అన్నారు. మరి రేవంత్ రైతులను మోసం చేసిండా లేదా? నమ్మితే నట్టేట ముంచారు అని దుయ్యబట్టారు.

రేవంత్ రెడ్డి మొండితనంతో మూర్ఖత్వంగా వ్యవహరిస్తూ విద్యార్థులపై లాఠీలు ఝుళిపిస్తున్నాడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు దాసోజు శ్రావణ్. ఎవరి బాగుకోసం రేవంత్ హడావిడిగా ఈ పరీక్షలు పెడుతున్నారు..సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేలోపు జీవోను రద్దు చేసి పరీక్షలు వాయిదా వేయాలన్నారు.

Also Read:గ్రూప్‌ 1 పరీక్షపై ప్రభుత్వ ప్రకటన

- Advertisement -