ఈ పోలీస్ అధికారి ఆవేదన చూస్తే హృదయం కల్చివేస్తున్నది, 30 ఏళ్లకు పైగా ప్రభుత్వ ఉద్యోగిగా సేవలందించిన ఠాగూర్ నారాయణ సింగ్ ఇలాంటి పరిస్థితుల్లో ఉండడం బాధాకరం అన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు.
ఒకవైపు రెండు కిడ్నీలు చెడిపోయి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, మరోవైపు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక ఆర్థిక సమస్యలు చుట్టుముట్టి ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆరోగ్య భద్రత కార్డుతో చికిత్స చేసుకుందామని హాస్పిటల్ కి వెళ్తే చెల్లదు అని పంపిస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం ఈ విశ్రాంత పోలీసు ఉద్యోగికి శాపంగా మారింది. ఇది ఒక నారాయణ సింగ్ గారి సమస్య కాదు రాష్ట్రవ్యాప్తంగా రిటైర్డ్ అయిన 8000 మంది ప్రభుత్వ ఉద్యోగుల జీవన్మరణ సమస్య. సీఎం రేవంత్ రెడ్డికి ఉద్యోగుల పట్ల ఏమాత్రం ప్రేమ ఉన్న వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను చెల్లించాలని డిమాండ్ చేశారు హరీశ్ రావు.
Also Read:ఉపవాసంతో క్యాన్సర్కి చెక్!
వైద్యసేవలు పొందడంలో అంతరాయం కలగకుండా ఈహెచ్ఎస్, పోలీస్ ఆరోగ్య భద్రత కార్డులు ఆసుపత్రుల్లో పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు.