రంజాన్ తోఫా బంద్: హరీష్

2
- Advertisement -

మైనారిటీ సోదరులందరికీ కేసీఆర్ తరఫున శుభాకాంక్షలు చెప్పారు మాజీ మంత్రి హరీష్‌ రావు. తాను మంత్రిగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా కూడా గత 12 – 13 ఏండ్లుగా ప్రతి సంవత్సరం ఇక్కడ ఇఫ్తార్ విందులో పాల్గొంటున్నా అన్నారు. ఇది మీకు నాకు మధ్య ఉన్నది విడదీయరాని బంధం… తెలంగాణలో మైనారిటీల సంక్షేమం కోసం బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ఎన్నో కార్యక్రమాలు అమలు చేశారు అన్నారు.

కానీ, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం 16 నెలల పాలనలో ఏం చేసిందో నాకంటే మీకే బాగా ఎక్కువ తెలుసు.. రంజాన్ నెలలో పేద ముస్లిం సోదరుల కుటుంబాలకు కేసీఆర్ గారు రంజాన్ తోఫా ఇచ్చేవారు అన్నారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో రంజాన్ తోఫా బంద్ అయిపోయింది.. మైనారిటీల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్కూళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో విలీనం చేస్తుందన్నారు.

ఇప్పటివరకు ఈ స్కూళ్లకు ఉన్న మైనారిటీ గుర్తింపు లేకుండా పోయేలా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నది.. కేసీఆర్ బీఆర్ఎస్ పాలనలో హోంమంత్రిగా మైనారిటీ వర్గానికి చెందిన మహమూద్ అలీ గారిని నియమించి గౌరవం ఇచ్చారు.. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇద్దరు మంత్రులను నియమించినా అందులో మైనారిటీ మంత్రి ఉన్నారు, కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో 12 మంది మంత్రులను నియమించినా అందులో ఒక్క మైనారిటీ మంత్రికి కూడా చోటు లేరు అన్నారు.

Also Read:మైనార్టీలకు ప్రాతినిధ్యం ఏదీ?: కేటీఆర్

మైనారిటీ మంత్రిగా ఉండాలి కదా. ఆ ప్రజలు తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలె ?.. కేసీఆర్ పాలనలో ఎక్కడా గొడవలు లేవు, కానీ ఇవాళ చాలాచోట్ల గొడవలు జరుగుతున్నాయి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత ఏడాది బడ్జెట్లో మైనారిటీల కోసం 3 వేల కోట్లు పెట్టింది. కానీ, వెయ్యి కోట్లు మాత్రమే విడుదల చేసింది. అవి కూడా ఖర్చు చేయలేదు, దీనిపై నేను అసెంబ్లీలో ప్రశ్నించాను అన్నారు. 40 ఏండ్ల నుంచి అడుగుతున్నా ఇక్కడ మదీనా మసీదు మరమ్మత్తులు చేయలేదు, కేసీఆర్ గారి హయాంలోనే పనులు చేపట్టారు.. స్థలం సరిపోకపోతే 10 కోట్ల రూపాయలతో సేకరించమని కేసీఆర్ చెప్పారు అన్నారు. 4 కోట్ల రూపాయలతో మదీనా ఫంక్షన్ హాల్ షాదీఖానా నిర్మాణం చేపట్టారు.. ప్రజ్ఞాపూర్, తూఫ్రాన్ తో పాటు, జిల్లాలో అంతటా ఖబరస్తాన్ పనులు చేపట్టారు అన్నారు. కేసీఆర్ మంజూరు చేసిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసింది.. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ పనులను తిరిగి ప్రారంభించాలని కోరుతున్నాను అన్నారు.

- Advertisement -