రూ.12వేలని నమ్మించి మోసంచేశారు:హరీష్‌తో ఆటోడ్రైవర్లు

1
- Advertisement -

రుణమాఫీ అమలు కోసం చేసిన కొట్లాట మాకోసం కూడా చేయండి… ఎన్నికల ముందు 12వేలని నమ్మించారు.. అధికారంలోకి వచ్చాక మోసం చేశారు అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మా సమస్యలపై అసెంబ్లీలో గొంతెత్తండి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయండిని విన్నవించారు. ఈ మేరకు మాజీ మంత్రి హరీష్ రావుకు ఆటో యూనియన్ నాయకుల వినతిపత్రం సమర్పించారు.

రుణమాఫీ అమలు కోసం ఏ విధంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వంతో కొట్లాడుతున్నారో.. అదేవిధంగా తమ ప్రయోజనాల కోసం పోరాడాలని ఆటో యూనియన్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావును కోరారు.శనివారం హరీష్ రావును కలిసి ఆటో యూనియన్ నాయకులు వారు పడుతున్న కష్టాలు, ఆవేదన గురించి చెప్పుకున్నారు.

మేనిఫెస్టోలో చెప్పిన హామీలు అమలు చేయకుండా, ప్రభుత్వం సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నదని తెలిపారు.అధికారంలోకి వస్తే 12 వేల ఆర్థిక సాయం అందజేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ, 15 నెలలు గడుస్తున్నా 15 రూపాయలు కూడా ఇవ్వలేదని మొరపెట్టుకున్నారు. బడ్జెట్లో ఆటో డ్రైవర్ల సంక్షేమం గురించి ఊసు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి మాట నిలుపుకోలేదని అన్నారు. ఆర్థిక సమస్యలతో ఆటోడ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని చెప్పుకొచ్చారు.కాబట్టి, ఆటో డ్రైవర్ల సమస్యలను, వారి బతుకులను దృష్టిలో పెట్టుకొని, 12000 ఆర్థిక సాయం ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీని అసెంబ్లీలో నిలదీయాలని, అమలు అయ్యేదాకా పోరాడాలని విజ్ఞప్తి చేశారు.

Also Read:నియోజకర్గాల పునర్విభజనపై స్టాలిన్ సమావేశం

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, మీ సమస్యలపై తప్పకుండా అసెంబ్లీలో మాట్లాడతానని, కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ఇచ్చిన 12 వేల ఆర్థిక సాయం సహా, ఇతర అన్ని హామీలు అమలు చేసేదాకా వదిలిపెట్టబోమని మాజీ మంత్రి హరీష్ రావు భరోసా ఇచ్చారు. ఆత్మహత్యలు పరిష్కారం కాదని, బిఆర్ఎస్ పార్టీ ఎల్లపుడూ అండగా ఉంటుందని ఆటో యూనియన్ నాయకులకు ధైర్యం చెప్పారు.

- Advertisement -