Harishrao:మార్కండేయ రథయాత్రలో ప్రత్యేక పేజలు

28
- Advertisement -

మహారాష్ట్రలోని సోలాపూర్ మార్కండేయ రథయాత్రలో ప్రత్యేక పూజలు చేశారు మంత్రి హరీశ్ రావు. సోలాపూర్ అక్కచెల్లెళ్లకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.100 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ పురాతన ఆలయంలో ప్రతి రాఖీ పౌర్ణమి కి రథయాత్ర ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ రథయాత్రలో పాల్గొనడం సంతోషకరంగా ఉందన్నారు.

మార్కండేయ ఆలయాభివృద్ధి కోసం బిఆర్ఎస్ పార్టీ తరఫున కోటి రూపాయల విరాళం ముఖ్యమంత్రి ప్రకటించారన్నారు.మహారాష్ట్ర ప్రజలు కలిసిమెలిసి ఐక్యతను చాటుకోవాలని కోరుతున్నాను అన్నారు. సోలాపూర్ లో బి అర్ ఎస్ భారీ బహిరంగ సభ కోసం రెండు చోట్ల స్థల పరిశీలన చేశారు మంత్రులు హరీష్ రావు మహమూద్ అలి, కల్వకుంట్ల వంశిధర రావు, వినోద్ కుమార్.బాల్ కోటి మైదానం,ఈద్గా మైదానాలను పరిశీలించారు.

Also Read:నచ్చినవాడు…’ఈ కాలమే’ సాంగ్

- Advertisement -