మొన్న మహబూబాబాద్ జిల్లాలో యూరియా పంపిణీ కోసం పోలీసులు టోకెన్లు జారీ చేస్తే, నేడు జగిత్యాలలో రైతులు పాస్ బుక్కులు, ఆధార్ కార్డులు క్యూలో పెట్టిన పరిస్థితి నెలకొందన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. ఉమ్మడి రాష్ట్రంలోని రైతుల కన్నీళ్ల కడగండ్లను పునరావృతం చేస్తున్నది కాంగ్రెస్ సర్కారు అన్నారు.
బీఆర్ఎస్ పాలనలో రైతే రాజుగా ఉన్న తెలంగాణలో రైతన్నను నట్టేట ముంచి, నడి రోడ్డు మీదకు తెచ్చిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు. రైతులకు అవసరమైన యూరియాను సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.
యూరియా కోసం రైతులు మండుటెండల్లో తంటాలు పడుతుంటే, రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండటం దుర్మార్గం అన్నారు. రైతు డిక్లరేషన్ అని దగా చేసి, రుణమాఫీ, రైతు భరోసా, పంట బోనస్ పేరుతో మోసం చేశారన్నారు.దేశానికి అన్నం పెట్టే రైతన్నను కంట నీరు పెట్టిస్తున్నరు. ఇప్పటికైనా కళ్లు తెరిచి రైతాంగానికి అవసరమైన యూరియాను సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు హరీశ్.
మొన్న మహబూబాబాద్ జిల్లాలో యూరియా పంపిణీ కోసం పోలీసులు టోకెన్లు జారీ చేస్తే, నేడు జగిత్యాలలో రైతులు పాస్ బుక్కులు, ఆధార్ కార్డులు క్యూలో పెట్టిన పరిస్థితి.
ఉమ్మడి రాష్ట్రంలోని రైతుల కన్నీళ్ల కడగండ్లను పునరావృతం చేస్తున్నది కాంగ్రెస్ సర్కారు.బీఆర్ఎస్ పాలనలో రైతే రాజుగా ఉన్న… pic.twitter.com/872OTUnPc4
— Harish Rao Thanneeru (@BRSHarish) February 24, 2025
Also Read:కోహ్లీ..రికార్డుల రారాజు!