ఆనంద్ దేవరకొండ…’డ్యూయెట్’

38
- Advertisement -

స్టార్ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా “డ్యూయెట్” ఇవాళ హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో లావిష్ మేకింగ్ తో కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. మధుర శ్రీధర్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దగ్గర పనిచేసిన మిథున్ వరదరాజ కృష్ణన్ “డ్యూయెట్”తో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో రితిక నాయక్ హీరోయిన్ గా నటిస్తోంది. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో “డ్యూయెట్” సినిమా ప్రారంభోత్సవం ‌వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో విజయ్ దేవరకొండ, దర్శకులు హరీశ్ శంకర్, చందూ మొండేటి, సాయి రాజేశ్,హీరో సత్య దేవ్ ఆనంద్ పేరెంట్స్ గోవర్థన్ దేవరకొండ, మాధవి అతిథులుగా హాజరయ్యారు. మూహూర్తపు సన్నివేశానికి హీరో హీరోయిన్లపై దర్శకుడు హరీశ్ శంకర్ క్లాప్ నివ్వగా…దర్శకుడు సాయిరాజేశ్, జ్ఞానవెల్ రాజా , సహ నిర్మాత మధుర శ్రీధర్ స్క్రిప్ట్ ను దర్శకుడు మిథున్ కి అందజేశారు. ఫస్ట్ షాట్ డైరెక్షన్ చందూ మొండేటి చేశారు. ఆనంద్ పేరెంట్స్ గోవర్ధన్ దేవరకొండ మాధవి దేవరకొండ కెమెరా స్విచ్ఛాన్ చేశారు.

దర్శకుడు మిథున్ వరదరాజ కృష్ణన్ మాట్లాడుతూ – డ్యూయెట్ సినిమాతో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం కావడం సంతోషంగా ఉంది. ఇదొక మంచి లవ్ స్టోరి. దర్శకుడిగా నాకు అవకాశం ఇచ్చిన నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా గారికి థ్యాంక్స్. ఆనంద్ కు కూడా కృతజ్ఞతలు చెబుతున్నా. మధుర శ్రీధర్ గారు మా టీమ్ కు ఏ సమస్య వచ్చినా సాల్వ్ చేయడానికి ఉన్నారు. మాకు సపోర్ట్ అందిస్తున్న అందరికీ థ్యాంక్స్. అన్నారు.

Also Read:KCR:అభివృద్ధి కావాలంటే బీఆర్ఎస్‌ను గెలిపించండి

హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ – డ్యూయెట్ నాకొక స్పెషల్ మూవీ. ఈ సినిమా టైటిల్ ను ఇండస్ట్రీలోని ఫ్రెండ్స్ తో షేర్ చేసుకున్నప్పుడు మంచి టైటిల్..మేము రిజిస్టర్ చేసుకుంటే బాగుండేది అన్నారు. అక్కడి నుంచి డ్యూయెట్ మీద పాజిటివ్ వైబ్స్ మొదలయ్యాయి. ఈ మూవీకి నన్ను సెలెక్ట్ చేసుకున్న నిర్మాతలు జ్ఞానవేల్ రాజా, మధుర శ్రీధర్ గారికి థ్యాంక్స్. జ్ఞానవేల్ గారు తమిళంలో సూర్య, కార్తి గారితో పెద్ద మూవీస్ చేశారు. ఇక్కడ నాతో మా అన్నయ్యతో అలాగే ప్రొడ్యూస్ చేయాలి. తెలుగులో బిగ్ మూవీస్ చేయబోతున్నారు జ్ఞానవేల్ రాజా. ఆ భారీ లైనప్ లోని మూవీస్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. మా సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ డైరెక్టర్ అనగానే చాలా హ్యాపీగా ఫీలయ్యా. ఆడుకాలం మూవీ నుంచి నేను ఆయనకు ఫ్యాన్ ను. అశోకవనంలో అర్జునకల్యాణం మూవీలో రితిక సూపర్బ్ గా నటించింది. ఈ సినిమాకు ఆమెకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. మిథున్ అమేజింగ్ స్టోరీ రాశాడు. మా టీమ్ తో కలిసి ఒక మంచి మూవీ చేయబోతున్నాం. అన్నారు.

హీరోయిన్ రితిక నాయక్ మాట్లాడుతూ – డ్యూయెట్ కథ విన్నప్పుడు మెస్మరైజ్ అయ్యాను. ఎప్పుడు షూటింగ్ కు వెళ్దామా అనేంత క్యూరియాసిటీ ఏర్పడింది. ఆనంద్ గారితో పనిచేయడం గౌరవంగా భావిస్తున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ మిథున్, ప్రొడ్యూసర్స్ జ్ఞానవేల్, శ్రీధర్ గారికి థ్యాంక్స్. అని చెప్పింది.

- Advertisement -