పవన్‌ గురించి ఖచ్చితంగా మాట్లాడుతా..

240
- Advertisement -

మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘డీజే’ పాటల వేడుక మొదలైంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే హీరో హీరోయిన్‌లుగా… ఎనర్జిటిక్ డైర‌క్ట‌ర్ హ‌రీష్‌ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్‌రాజు నిర్మిస్తున్న సినిమా `డీజే’ దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌`. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప‌తాకంపై రూపొందుతోన్న 25వ సినిమా కావ‌డం విశేషం.
Harish Shankar Excellent Speech About Power Star Pawan Kalyan .
రేసుగుర్రం`, `సన్నాఫ్ సత్యమూర్తి`, `సరైనోడు` వంటి వరుస బ్లాక్ బస్టర్ చిత్రాల త‌ర్వాత బ‌న్ని చేస్తున్న సినిమా కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. అంతేకాకుండా పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ అల్లు అర్జున్‌ నటించిన డీజేకి ఎంత నెగిటివ్‌గా రియాక్ట్‌ అయినా…అవన్నీ దాటుకొని మరీ  థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ విడుద‌లైన రెండు రోజుల్లోనే 10 మిలియ‌న్స్ వ్యూస్‌తో ప్రేక్ష‌కుల నుండి ట్రెమెండ‌స్ రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకుంటుంది.

ఇక ఇదిలా ఉంటే డీజే  ఆడియో వేడుకలో…..  డైర‌క్ట‌ర్ హ‌రీష్‌ శంక‌ర్ మాట్లాడుతూ.. డీజే పడ్డ కష్టం గురించి మాట్లాడుతూనే పవన్‌ కళ్యాణ్‌ గురించి ప్రస్థావించాడు. పవన్‌ గురించి మాట్లాడకుండా ఉండలేనని, అసలు పవన్‌ గురించి మాట్లాడకపోతే అసంతృప్తిగా ఉంటుందని అన్నాడు.
Harish Shankar Excellent Speech About Power Star Pawan Kalyan .
అంతేకాకుండా డీజే లో పవన్‌ గురించే  ప్రత్యేకంగా డైలాగ్ ఉంటుందని అన్నారు.   ‘మనం చేసే పనిలో మంచి కనిపించాలే తప్ప..మనిషి కనిపించాల్సిన అవసరం లేదు’ అనే డైలాగ్‌ కి పవనే స్పూర్తి అని చెప్పాడు హ‌రీష్‌ శంక‌ర్ .

అంతేకాకుండా తాను సినిమాలతో హిట్స్‌ అందుకుంటుంటే పవన్‌ తనకు ఎన్నో విషయాలని చెప్పాడని, ఎంత హిట్స్‌ వస్తే అంతకంటే జాగ్రత్తగా ఉండాలని చెప్పారని చెప్పారు. ఇక గబ్బర్‌సింగ్‌తో హిట్ ఇచ్చింది పవన్‌ అయితే మిరపకాయతో మాత్రం పునర్జన్మనిచ్చింది మాత్రం మాస్‌ మహరాజ రవితేజ అని చెప్పుకొచ్చాడు.

- Advertisement -