మంత్రిపదవి రాలేదని బాధలేదు:హరీష్‌

301
harish rao
- Advertisement -

మంత్రిపదవి రాలేదని బాధలేదని స్పష్టం చేశారు మాజీ మంత్రి హరీష్‌ రావు. రాజ్‌భవన్‌లో కొత్త మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన హరీష్‌ మంత్రివర్గానికి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్‌ టీఆర్ఎస్ పార్టీలో క్రమశిక్షణ కలిగిన సైనికుడినని కేసీఆర్‌ నాయకత్వంలో పనిచేస్తాననే తెలిపారు.

ముఖ్యమంత్రి ఆలోచనలను తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అమలు చేసి ఈ ప్రభుత్వానికి, కేసీఆర్‌కి మంచిపేరు తేవాలని కొత్తగా ఎన్నికైన మంత్రులకు సూచించారు. సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేయొద్దని సూచించారు. తనపేరుతో ఎలాంటి సోషల్ మీడియా గ్రూపులు లేవని వాటిని నమ్మవద్దని సూచించారు.

పార్టీ, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలను తప్పకుండా పాటిస్తానని తెలిపారు. ప్రాంతాలు, అన్ని వర్గాలు, సమీకరణలను దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారని… నాకు వారు ఏ భాధ్యత అప్పగించినా క్రమశిక్షణగల కార్యకర్తగా దానిని అమలు చేస్తానని స్పష్టం చేశారు. అందరూ పార్టీ కోసం, సీఎం కేసీఆర్ కోసం పనిచేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

- Advertisement -