ఓటేసిన హరీష్‌,తారక్,చంద్రబాబు

538
tarak harish rao
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలు ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. సిద్దిపేటలోని 107వ పోలింగ్‌ బూత్‌లో మంత్రి హరీష్ రావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఓటు వేయడానికి వచ్చేవారు తప్పనిసరిగా ఏదైనా ఒక గుర్తింపు కార్డును వెంటతెచ్చుకోవాలని హరీశ్‌రావు సూచించారు. విద్యావంతులు, పట్టణ వాసులు ఓటు వేయడాన్ని బాధ్యతగా భావించాలన్నారు. ప్రజలు పోలింగ్‌లో పాల్గొనడం ద్వారా తమ అభిప్రాయాన్ని తెలపాలన్నారు.

హైదరాబాద్‌ జూబ్లీ హిల్స్‌లో జూనియర్ ఎన్టీఆర్,బంజారాహిల్స్‌ రోడ్ నెంబర్ 33లోని పోలింగ్ బూత్‌లో అల్లు అర్జున్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రానికి చేరుకున్న తారక్ అందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలన్నారు.

ఏపీ సీఎం చంద్రబాబు ఉండవల్లిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబంతో పాటు వచ్చి ఆయన ఓటు వేశారు. ఓటర్లందరూ ఉత్సాహంగా పోలింగ్‌లో పాల్గొనాలన్నారు. రాష్ట్రంలో అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన కోరారు.

- Advertisement -