గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న క్రికెటర్ హనుమ విహారి..

151
Green India Challenge
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా బొల్లారంలోని తన నివాసం సురభి ఎన్‌క్లెవ్స్‌లో మొక్కలు నాటాడు భారత క్రికెటర్ హనుమ విహారి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు.గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చాలా గొప్ప కార్యక్రమం అని కొనియాడారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మహమ్మద్ సిరాజ్,రాహుల్ ద్రవిడ్,కృష్ణ ప్రియ ముగ్గురికి ఛాలెంజ్ విసిరారు హనుమ విహారి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ పాల్గొన్నారు. అనంతరం హనుమ విహరికి వృక్షవేదం పుస్తకాన్ని బహుకరించారు గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ.

- Advertisement -