యాదాద్రి జిల్లా బొమ్మల రామారం మండలం హజీపూర్ హత్యల కేసు విచారణ జరుగుతోంది. ఈ విచారణలో భాగంగా నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు జిల్లా జైల్ నుంచి భారీ బందోబస్తు నడుమ కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో 44 మంది సాక్షులను జడ్జి ముందు ఉంచారు పోలీసులు.
ఈ రోజు 313 కింద విచారణ జరిపిన కోర్టు సాక్షులు చెప్పిన విషయాలను నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని జడ్జి ప్రశ్నించగా… సమాధానం ఇవ్వలేదు. దీనితో మిగితా విచారణను డిసెంబర్ 26కు కోర్టు వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి క్రైమ్. No 33/19 కేటాయింపు చేశారు. కేసు విచారణాధికారిగా భువనగిరి డీసీపీ భుజంగరావును నియమించారు.
అదేవీధంగా ఈ కేసుకు స్పెషెల్ పబ్లిక్ ప్రాస్య్కుటర్గా ప్రభుత్వం రంగారెడ్డి కోర్టు పబ్లిక్ ప్రాస్య్కుటర్ సామల రంగారెడ్డి ని నియమించింది.29 అక్టోబర్ 2019 నుంచి కోర్టులో విచారణ ప్రారంభమైంది. నిందితుడు శ్రీనివాస్ రెడ్డిపై 376/3,366,376/a,302,201 సెక్షన్లు నమోదైయ్యాయి. ఈ కేసు విచారణ ఈ నెల చివరిలోపు పూర్తి కానుంది. శిక్ష కూడా ఈ నెల చివరిలోపు పూర్తిగా ఖరారు అవుతుంది.
Hajipur Srinivas Reddy Produced in Bhuvanagiri Court..Hajipur Srinivas Reddy Produced in Bhuvanagiri Court..Hajipur Srinivas Reddy Produced in Bhuvanagiri..