వైద్య, పారిశుధ్య సిబ్భందికి గుత్తా సుఖేందర్ సాయం..

158
gutha
- Advertisement -

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రజలను కభళిస్తోంది. కరోనా కట్టడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు పటిష్టమైన చర్యలు చేపడుతున్నాయి. ఇక కరోనా వల్ల దేశం మొత్తం లాక్‌డౌన్‌ విధించారు. అన్నిరాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు కావలసిన నిత్యావసర వస్తువులను అందుబాటులో ఉంచుతున్నాయి. అలాగే పలువురు ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు ప్రజలకు సాయం చేస్తున్నాయి.

mla lingaiah

అదేవిధంగా కరోనా నియంత్రణలో నిత్యం శ్రమిస్తున్న వైద్య సిబ్భంది,పారిశుధ్య కార్మికులకు ప్రజాప్రతినిధులు అండగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వైద్య సిబ్భందికి, మున్సిపాలిటీ కార్మికులకు శానిటేషన్, మస్కులు, బియ్యం, నిత్యావసర వస్తువులు, బత్తాయి పండ్లు పంపిణీ చేశారు.

- Advertisement -