‘గుంటూరు కారం’.. ఓటీటీ పార్ట్‌నర్‌ ఫిక్స్

37
- Advertisement -

సూపర్ స్టార్ మహేశ్‌ బాబు హీరోగా నటించిన కొత్త చిత్రం ‘గుంటూరు కారం’. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన గుంటూరు కారం ఎన్నో అంచనాలు, మరెన్నో రూమర్స్ నడుమ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కలయిక అంటే సహజంగానే అందరికీ ఆసక్తి ఉంటుంది. దీనికితోడు టీజర్, సాంగ్స్ ప్రమోషన్స్ విషయంలో సో సో ఆనిపించుకున్నా.. గుంటూరు కారం విడుదల సమయానికి రోజులు దగ్గర పడే కొద్దీ విపరీతమైన క్రేజ్ బిల్డ్ అవుతుంది. యూత్ మొత్తం గుంటూరు కారం థియేటర్స్ కి కదిలేలా ఉన్నారు.

ప్యాన్ ఇండియా ప్రేక్షకులు థియేటర్స్ కి పరిగెత్తేలా ఉన్నారు. ఇక విడుదలయ్యే ప్రతి భాషలో గుంటూరు కారం కి పాజిటివ్ టాక్ వచ్చేలా ఉంది. అందుకే, అందరూ మహేష్ బాబు బీభత్సం గురించే మాట్లాడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా మహేష్ బాబు ప్రభంజనం కనిపిస్తోంది. మహేష్ మాస్ కటౌట్ గురించి చెబుతుంటే సూపర్ స్టార్ ఫాన్స్ కి పూనకాలు వచ్చేస్తున్నాయి. ఎక్కువగా గుంటూరు కారం ఫస్ట్ హాఫ్ లో 20 మినిట్స్ గురించి, అలాగే సెకండ్ హాఫ్ లాస్ట్ 40 నిమిషాల గురించే ఎక్కువ ముచ్చట వినిపిస్తుంది. ఓవరాల్ గా గుంటూరు కారం క్రేజీ బ్లాక్ బస్టర్ అని తేల్చేసారు.

దీంతో ఇప్పుడు గుంటూరు కారం డిజిటల్ పార్ట్నర్ పై అందరిలో ఆత్రుత, ఆసక్తి బయలుదేరాయి. మరి ఈ మధ్య బిగ్ బడ్జెట్ మూవీస్ అన్నిటినీ ఎగరేసుకుపోయే నెట్ ఫ్లిక్స్ ఇప్పుడు గుంటూరు కారం ఓటీటీ రైట్స్ ని చేజిక్కించుకుంది. ఈ డీల్ కోసం నెట్ ఫ్లిక్స్ దాదాపు 110 కోట్లు కోట్ చేసినట్లుగా తెలుస్తోంది. గుంటూరు కారం పై అంచనాలు ఏ రేంజ్ ఉన్నాయో ఈ డీల్ వింటేనే అర్ధమవుతుంది. ఇక గుంటూరు కారం అయితే ఇప్పుడప్పుడే ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ లేదు అని.. రిలీజ్ రోజు నుంచి 60 రోజుల తర్వాతే గుంటూరు కారం నెట్ ఫ్లిక్స్ నుంచి ఓటిటి ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది అని తెలుస్తుంది.

Also Read:Jagan:జగన్ చూపు.. ఎటువైపు?

- Advertisement -